E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఆకాశాన్నంటిన విమాన ఛార్జీలు పాతాళానికి.. దుబాయ్ వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్!

ఆకాశాన్నంటిన విమాన ఛార్జీలు పాతాళానికి.. దుబాయ్ వెళ్లే భారత ప్రయాణికులకు గుడ్ న్యూస్!
Advertisement

UAE-India Flight Ticket Prices Fall: యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు హ్యాపీ న్యూస్. గత కొన్ని వారాలుగా భారీగా పెరిగిన విమాన టిక్కెట్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. విమానయాన సంస్థలు అదనపు సర్వీసులను ప్రారంభించడం, నిలిపివేసిన విమానాలను మళ్లీ అందుబాటులోకి తీసుకురావడం, సీట్ల సంఖ్యను పెంచడం వల్ల ధరలు దిగి వస్తున్నాయి. ముఖ్యంగా కేరళకు వెళ్లే మార్గాల్లో టిక్కెట్ ధరలు గణనీయంగా తగ్గాయి. గతంలో కొన్ని మార్గాల్లో టిక్కెట్ ధరలు 3,500 దినార్స్(రూ.81,550) నుంచి 3,600 దినార్స్(రూ.83,880)  వరకు చేరుకోగా, ఇప్పుడు సుమారు 2,600 దినార్స్(రూ.60,580)  వరకు పడిపోయాయి.

ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రూట్

యూఏఈ-భారత్ మార్గం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమాన మార్గాల్లో ఒకటి. ముఖ్యంగా యూఏఈలో పనిచేస్తున్న భారతీయులు సెలవుల సమయంలో కుటుంబాలను కలిసేందుకు పెద్ద ఎత్తున స్వదేశానికి వెళ్తుంటారు. జూలై, ఆగస్టు నెలల్లో పాఠశాల సెలవులు కూడా ఉండటంతో ఈ సమయంలో ప్రయాణ డిమాండ్ మరింత పెరుగుతుంది. గత కొంతకాలంగా ప్రాంతీయ పరిస్థితుల కారణంగా కొన్ని విమాన సర్వీసులు తగ్గాయి. సీట్ల కొరత ఏర్పడి, టిక్కెట్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు పరిస్థితులు కొంత సాధారణ స్థితికి రావడంతో విమానయాన సంస్థలు తమ సర్వీసులను తిరిగి పెంచుతున్నాయి. అదనపు సీట్లు అందుబాటులోకి రావడంతో ధరలు కూడా క్రమంగా తగ్గుతున్నాయి.

కేరళ రూట్ లో మరింత తగ్గిన ధరలు

Advertisement

ప్రత్యేకంగా కొచ్చి, కోజికోడ్ వంటి కేరళ నగరాలకు వెళ్లే మార్గాల్లో ఎక్కువ మార్పు కనిపిస్తోంది. కొన్ని తక్కువ ధరల విమాన సంస్థలు కూడా అదనపు సర్వీసులను ప్రారంభించడంతో పోటీ పెరిగి, ఛార్జీలు తగ్గాయి. కొన్ని మార్గాల్లో టిక్కెట్ ధరలు 300 దినార్స్(రూ.7,000) నుంచి 400 దినార్స్(రూ.9,300)వరకు తగ్గినట్లు ట్రావెల్ నిపుణులు వెల్లడించారు. అయితే, ఈ తగ్గింపు చాలా రోజులు ఉండదని చెప్తున్నారు. ప్రస్తుతం కనిపిస్తున్న ధరల తగ్గుదల కేవలం కొద్ది రోజులు ఉండే అవకాశం ఉందన్నారు. ఎందుకంటే వేసవి సెలవుల సమయంలో డిమాండ్ ఇంకా భారీగానే కొనసాగుతోంది. ప్రయాణ తేదీలు దగ్గరపడే కొద్దీ టిక్కెట్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.

గత ఏడాదితో పోల్చితే ధరలు ఎక్కువే!

గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ విమాన ఛార్జీలు 15 నుంచి 20 శాతం వరకు ఎక్కువగానే ఉన్నాయి. అందుకే ప్రయాణం ప్లాన్ చేసుకునే వారు టిక్కెట్ ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తక్కువ ధరలు కనిపించిన వెంటనే బుకింగ్ చేసుకోవడం ఉత్తమమని ట్రావెల్ నిపుణులు సూచిస్తున్నారు.  యూఏఈ-భారత్ విమాన ఛార్జీలలో ప్రస్తుతం కొంత ఉపశమనం కనిపిస్తున్నప్పటికీ, ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదనపు విమాన సర్వీసులు కొనసాగితే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.  కానీ, సమ్మర్ రష్ పెరిగితే టిక్కెట్ల ధరలు మళ్లీ పెరగవచ్చని నిపుణులు చెప్తున్నారు.

Advertisement

Read Also: బోర్డింగ్ పాస్ ఉన్నా విమానం ఎక్కనివ్వలే.. సీన్ కట్ చేస్తే స్పైస్‌ జెట్‌ కు షాక్!

Related News

ఆదివారాల్లో టూరిస్టులకు నో ఎంట్రీ.. అత్యంత పరిశుభ్రమైన గ్రామం సరికొత్త నిర్ణయం!

వందే భారత్‌లో CC, EC అంటే ఏంటి? ప్రయాణానికి ఏ క్లాస్ బెస్ట్?

బోర్డింగ్ పాస్ ఉన్నా విమానం ఎక్కనివ్వలే.. సీన్ కట్ చేస్తే స్పైస్‌ జెట్‌ కు షాక్!

వర్షాకాలంలో వీకెండ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? హైదరాబాద్ సమీపంలో బెస్ట్ వాటర్‌ఫాల్స్ ఇవే

వందే భారత్ డోర్లు క్లోజ్ అయినా నో టెన్షన్.. ఇలా చేస్తే హ్యాపీగా రైలు ఎక్కొచ్చు!

పిడుగులు పడినా చెక్కుచెదరని ఈఫిల్ టవర్.. అదెలా సాధ్యం?

ఇండియాలోనే స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ ఫీలింగ్.. దేశంలో తప్పకుండా చూడాల్సిన 5 అద్భుత టూరిస్ట్ ప్రాంతాలు

Big Stories

×