7 New Amrit Bharat Express Trains: దేశంలో రైలు ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలను కలుపుతూ 7 కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఈ రైళ్లను నడపనున్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మార్గాలు, ప్రధాన స్టాప్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తెలంగాణలోని చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ వరకు ఈ రైలు నడవనుంది. కాజీపేట్, పెద్దపల్లి, మంచిర్యాల్, బల్హర్షా, నాగ్పూర్, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, గోండా మీదుగా గోరఖ్పూర్ చేరుతుంది. ఈ రైలు ద్వారా దక్షిణ, మధ్య, ఉత్తర భారత ప్రాంతాల మధ్య ప్రయాణ సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉంది.
ధన్బాద్ నుంచి కోయంబత్తూరు వరకు మరో అమృత్ భారత్ రైలు ప్రతిపాదించారు. గయా, ససారం, ప్రయాగ్రాజ్, జబల్పూర్, ఇటార్సీ, నాగ్పూర్, మంచేరియల్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం, విజయవాడ, కాట్పాడి, సేలం, ఈరోడ్ మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.
ప్రయాగ్రాజ్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు వారానికి ఒకసారి రైలు నడపనున్నారు. సత్నా, జబల్పూర్, ఇటార్సీ, భుసావల్, కళ్యాణ్ ప్రధాన స్టాప్లుగా ఉంటాయి.
మరో వారపు రైలు ప్రయాగ్రాజ్ నుంచి గుజరాత్లోని ఉద్నా వరకు నడుస్తుంది. ఫతేపూర్, కాన్పూర్ ప్రాంతం, ఇటావా, ఆగ్రా, కోట, సవాయ్ మాధోపూర్, రత్లాం, వడోదర, ఉద్నా వంటి ప్రాంతాల్లో ఆగుతుంది.
సుబేదార్గంజ్ నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు మరో అమృత్ భారత్ రైలు ప్రతిపాదించారు. ఫతేపూర్, బందా, చిత్రకూట్, సత్నా, కట్ని, జబల్పూర్, ఇటార్సీ, ఖాండ్వా, భుసావల్, నాసిక్ రోడ్, కళ్యాణ్, థానే ప్రధాన స్టాప్లుగా ఉంటాయి.
గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి మరో వారపు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది. ఖలీలాబాద్, బస్తీ, గోండా, సీతాపూర్, బరేలీ, మొరాదాబాద్, ఘజియాబాద్ మీదుగా ఢిల్లీ చేరుతుంది.
గోరఖ్పూర్ నుంచి ముంబై బాంద్రా టెర్మినస్ వరకు మరో రైలు ప్రతిపాదించారు. లక్నో ప్రాంతం, కాన్పూర్, ఆగ్రా, కోట, రత్లాం, వడోదర, సూరత్, వల్సాద్, వాపి, బోరివలి మీదుగా బాంద్రా చేరుతుంది.
ఈ ఏడు రైళ్లు అందుబాటులోకి వస్తే ఉత్తర, మధ్య, దక్షిణ, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య రైలు కనెక్టివిటీ మరింత పెరగనుంది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం చేయాలనుకునే వారికి అమృత్ భారత్ సేవలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే పూర్తి టైమింగ్స్, ప్రారంభ తేదీలు, ఛార్జీల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Read Also: బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ vs ఫ్లైట్.. ఏది బెటర్?