E-Paper
Advertisement

Vande Bharat Sleeper Train: త్వరలో న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ స్లీపర్ పరుగులు… టికెట్ ధర ఎంతో తెలుసా?

Vande Bharat Sleeper Train: త్వరలో న్యూఢిల్లీ-సికింద్రాబాద్ మధ్య వందే భారత్ స్లీపర్ పరుగులు… టికెట్ ధర ఎంతో తెలుసా?
Advertisement

New Delhi to Secunderabad Vande Bharat Sleeper Train: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఒకేసారి దేశ వ్యాప్తంగా సుమారు 10 రైళ్లను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో తెలుగు రాష్ట్రాలకు 2 నుంచి 3 రైళ్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూట్లు కూడా దాదాపు ఖరారు అయ్యాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  తాజాగా దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి రాష్ట్ర రాజధానికి హైదరాబాద్ కు ఓ వందేభారత్ స్లీపర్ రైలును నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. న్యూఢిల్లీ-సికింద్రాబాద్-న్యూఢిల్లీ మధ్య ఈ కొత్త రైలును ప్రారంభించబోతోంది. ఇప్పటికే, ఈ మార్గంలో రాజధాని ఎక్స్ ప్రెస్, దురంతో ఎక్స్ ప్రెస్ నడుస్తుండగా, ఇప్పుడు మూడో ప్రీమియం రైలుగా వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతోంది.

న్యూఢిల్లీ- సికింద్రాబాద్  స్లీపర్ రైలు వేగం, ప్రయాణ సమయం

Advertisement

న్యూఢిల్లీ- సికింద్రాబాద్ మధ్య 1,667 కి. మీ దూరం ఉంటుంది. సుమారు 20 గంటల్లో ఈ వందేభారత్ తన ప్రయాణాన్ని పూర్తి చేయనుంది. ఈ వందే భారత్ స్లీపర్ రైలు గంటకు 160 కి.మీ. వేగంతో నడిచేలా రూపొందించారు. ఈ రైలు ప్రారంభం అయితే, ఈ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదే అవుతుంది. ఆ తర్వాత ప్లేస్ లో రాజధాని ఎక్స్ ప్రెస్, దురంతో ఎక్స్ ప్రెస్ ఉంటాయి.

 ఎన్ని స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటుందంటే?

Advertisement

న్యూఢిల్లీ నుంచి బయల్దేరే ఈ రైలు సికింద్రాబాద్ వరకు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఈ రైలు ఆగ్రా కాంట్, గ్వాలియర్, వి లక్ష్మీబాయి జెహెచ్ఎస్, భోపాల్, ఇటార్సి, నాగ్‌ పూర్, బల్హర్షా,  కాజీపేట్ జంక్షన్‌తో సహా ఈ మార్గంలోని ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. రెండు వైపులా ఈ స్టాఫ్ లు ఉంటాయి.

కోచ్ కంపోజిషన్, టికెట్ ధర గురించి..

న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. వాటిలో 11 AC 3 టైర్ కోచ్‌లు, 4 AC 2 టైర్ కోచ్‌లతో పాటు ఒక ఫస్ట్ క్లాస్ AC కోచ్ ఉంటుంది. AC 3-టైర్ కోచ్‌లో ప్రయాణించడానికి ఛార్జీ దాదాపు రూ. 3600, AC 2-టైర్ కోచ్ దాదాపు రూ. 4800,  AC ఫస్ట్ క్లాస్ దాదాపు రూ. 6000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే అసలు రేట్ల వివరాలు వెల్లడి అయ్యే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ- సికింద్రాబాద్ వందే భారత్ స్లీపర్ రైలు టైమ్ టేబుల్

న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ నుంచి రాత్రి 8.50 నిమిషాలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్ కు చేరుకునే అవకాశం ఉంది. త్వరలోనే పూర్తి షెడ్యూల్ ను రైల్వేశాఖ విడుదల చేయనుంది. ఎన్ని స్టాఫ్ లు, ఎంత సేపు ఆగుతుంది? అనే పూర్తి వివరాలు వెల్లడించనుంది. ఈ స్లీపర్ రైలు దేశ, రాష్ట్ర రాజధానుల మధ్య కనెక్టివిటీని పెంచనుంది.

Read Also:  రైలు టికెట్స్ త్వరగా బుక్ చేసుకోవాలా? IRCTC eWalletను ఇలా వాడేయండి!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×