E-Paper
Advertisement

Vijayawada Kazipet rail line: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. విజయవాడ టు ఖాజీపేట్ మూడో లైన్ రెడీ!

Vijayawada Kazipet rail line: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. విజయవాడ టు ఖాజీపేట్ మూడో లైన్ రెడీ!

Vijayawada Kazipet rail line: రైల్వే రంగంలో ఏపీ, తెలంగాణకు చెందిన మరో కీలక మార్గం ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. విజయవాడ నుండి ఖాజీపేట వరకు మూడో రైలు మార్గం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. మొత్తం 219 కిలోమీటర్ల ఈ మార్గంలో ఇప్పటికే 148 కిలోమీటర్లు పూర్తయ్యాయి. అంటే ఈ ప్రాజెక్టు ఇప్పుడు ఓ కీలక దశలోకి చేరింది. ఇది పూర్తిగా పూర్తయితే ప్రయాణికుల రద్దీ తక్కువై, రైలు సమయాలపై ప్రజలకు మరింత నమ్మకం పెరుగుతుంది. మరోవైపు, పారిశ్రామిక రంగానికి ఇది బూస్టర్ గా మారనుంది.

విజయవాడ నుంచి కాజీపేట మార్గం దక్షిణ, మధ్య భారతాన్ని కలిపే ఓ ప్రధాన రైలు మార్గం. ఇప్పటికే ఈ మార్గంపై రోజుకు వందల సంఖ్యలో రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ రైళ్లు అన్నీ ఒక్కటే ట్రాక్ మీద పోటీ పడుతుండటంతో ఆలస్యం తప్పదు. అలాంటప్పుడు మూడో ట్రాక్ చాలా అవసరం. ఇది పూర్తిగా సిద్ధమైతే రైళ్లు మరింత సమయ పాలనతో నడిచే అవకాశం ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ, ఏపీ ప్రాంతాల మధ్య క‌మ‌ర్షియ‌ల్‌ వాణిజ్యం కూడా వేగంగా కదిలే అవకాశం ఉంటుంది.

పరిశీలించాల్సిన విషయం ఏంటంటే.. ఈ మార్గం గుండా చాలా పెద్ద మొత్తంలో సిమెంట్, బొగ్గు, ఇతర ముడి వస్తువులు తరలించబడతాయి. ముఖ్యంగా థర్మల్ పవర్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు తరలింపుని ఈ మార్గం చాలా వేగంగా చేయగలదు. ఇప్పటివరకు రద్దీగా ఉండటంతో ఈ రవాణా కొంత ఆలస్యం అయ్యేది. ఇప్పుడు మూడో లైన్ ద్వారా వేగంగా, నష్టాలు లేకుండా, సమయానికి బొగ్గు, సిమెంట్ వంటి వస్తువులు గమ్యస్థానాలకు చేరనున్నాయి. అంటే పరిశ్రమల ఉత్పత్తి సామర్థ్యం పెరగనుంది. ఈ లైన్ తో ఆర్థిక ప్రగతికి మార్గం అవుతుంది.

ఇదే సమయంలో ప్రయాణికుల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఇప్పటివరకు విజయవాడ – ఖాజీపేట మార్గంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో కొన్ని రైళ్లు షార్ట్‌టర్మ్ క్యాన్సిల్ చేయబడుతున్నాయి, లేదా డైవర్ట్ చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి పూర్తిగా తగ్గేందుకు మూడో లైన్ తోడ్పడుతుంది. ముఖ్యంగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఇది మంచి వార్త. అలాగే ఈ మార్గం గుండా నడిచే వందే భారత్, శతాబ్ది వంటి స్పీడ్ ట్రైన్లకు మార్గం ఖాళీగా ఉండటంతో, ఆ రైళ్లు కూడా నిశ్చలంగా, సమయానికి నడవవచ్చు.

Also Read: Railway project failures 2025: రైల్వేలో నో ప్రాఫిట్.. ఫుల్ లాస్! కాగ్ సంచలన నివేదిక.. మరీ అన్ని కోట్లా?

ఇంతకీ ఇది ఓ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టేనా? కాదు. ఇది ప్రాంత అభివృద్ధికి బాట వేసే ప్రాజెక్టు కూడా. ఎందుకంటే, ఈ మార్గం గుండా ఉన్న చిన్న పట్టణాలు, గ్రామాలు రైల్వే కనెక్షన్ వల్ల అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ట్రేడ్, టూరిజం, ఉద్యోగ అవకాశాలు పెరగడం ద్వారా ప్రజల జీవన విధానం కూడా మెరుగవుతుంది. రైలు మార్గం ఉన్న చోట అభివృద్ధి స్వయంగా వస్తుందని ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నెరపబడింది. ఇప్పుడు అదే పరిస్థితి విజయవాడ – ఖాజీపేట మధ్య మార్గంలోనూ కనిపించనుంది.

ఇప్పటికే పూర్తయిన 148 కిలోమీటర్ల రూట్ కమిషన్ కావడం వల్ల కొన్ని గూడ్స్ రైళ్లు కొత్త లైన్ పై నడవడం మొదలైంది. మిగిలిన 71 కిలోమీటర్లు కూడా వచ్చే ఏడాది చివరికి పూర్తవుతుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ప్రాజెక్ట్ పూర్తవ్వగానే దక్షిణ రైల్వే పరిధిలో ఉన్న రైలు సర్వీసులు మరింత సమర్థవంతంగా నిర్వహించబడతాయి. ఇక లాంగ్ డిస్టెన్స్ రైళ్ల ఆలస్యం, ప్రయాణికులకు కలిగే ఇబ్బందులు అన్నీ చాలావరకు తగ్గిపోతాయి.

వీటన్నింటికీ మించి చెప్పాల్సింది ఏమంటే.. ఇది కేంద్ర ప్రభుత్వం, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా తీసుకుంటున్న ఒక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మూడో లైన్ ప్రాజెక్ట్ కోసం భారీ బడ్జెట్ కేటాయించారు. రవాణా మౌలిక వసతుల అభివృద్ధిలో ఇది ఒక మెయిల్స్ స్టోన్‌గా నిలుస్తుంది.

విజయవాడ – ఖాజీపేట మూడో రైలు మార్గం అంటే కేవలం మరో పట్టా కాదు, అది దక్షిణ భారతాభివృద్ధికి పునాది వేసే ప్రాజెక్టు. ఇది ట్రాన్స్‌పోర్ట్, పరిశ్రమ, టూరిజం, ప్రజల జీవితం.. అన్నింటిపై దీర్ఘకాల ప్రభావం చూపబోతోంది.

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×