E-Paper
Advertisement

Telangana railways: పాత రూపానికి గుడ్‌బై.. తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌ కు మోడర్న్ టచ్.. సెల్ఫీకి రెడీనా!

Telangana railways: పాత రూపానికి గుడ్‌బై.. తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌ కు మోడర్న్ టచ్.. సెల్ఫీకి రెడీనా!
Advertisement

Telangana railways: తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపర్చేందుకు రైల్వే శాఖ తీసుకున్న అద్భుతమైన నిర్ణయాల్లో వికారాబాద్ జంక్షన్ ఆధునికీకరణ ఒకటి. దేశవ్యాప్తంగా 1,300కుపైగా స్టేషన్లను ఆధునిక రూపంలో తీర్చిదిద్దే “అమృత్ స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్” కింద వికారాబాద్ స్టేషన్ పనులు వేగంగా సాగుతున్నాయి. కొంత పనులు పూర్తయ్యి, మరికొన్ని ఫైనల్ దశకు చేరుకోవడంతో ఈ స్టేషన్ ఇప్పుడు ఆధునిక సదుపాయాల కేంద్రంగా మారబోతోంది.

వికారాబాద్ జంక్షన్‌ రూపాన్ని మార్చే పనుల్లో చాలా కీలకమైనవి ఇప్పటికే పూర్తి అయ్యాయి. ముఖ్యంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) గార్డర్లు విజయవంతంగా అమర్చడం పెద్ద ముందడుగుగా నిలిచింది. దీని వలన ప్రయాణికులకు ఒక ప్లాట్‌ఫార్మ్‌ నుంచి మరొకదానికి సులభంగా వెళ్లే సౌకర్యం లభించనుంది.

Advertisement

అంతేకాకుండా, ఆధునిక సౌకర్యాలతో కూడిన VIP లాంజ్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఎయిర్‌కండిషన్డ్ సీటింగ్, వైఫై సదుపాయం, పరిశుభ్రతతో కూడిన వాతావరణం ప్రయాణికుల అనుభవాన్ని మరింత సౌకర్యవంతం చేయనుంది. టికెట్ బుకింగ్ ఆఫీస్ కొత్త రూపంలో సిద్ధమవుతుండగా, కాఫెటీరియా కూడా ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం పూర్తవుతోంది.

ఇప్పటికీ కొన్ని పనులు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వెయిటింగ్ హాల్స్ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేసారి సౌకర్యంగా కూర్చునేలా విశాలమైన స్థలాన్ని సృష్టిస్తున్నారు.

Advertisement

అలాగే ప్లాట్‌ఫార్మ్‌లను పునరుద్ధరిస్తూ కొత్త టైల్ ఫ్లోరింగ్, మెరుగైన షెల్టర్స్, సౌకర్యవంతమైన సీటింగ్ వసతులను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, వికలాంగులు సులభంగా ప్రయాణం సాగించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌కు ర్యాంప్ నిర్మాణం కొనసాగుతోంది. అలాగే శారీరక ఇబ్బందులు ఉన్నవారికి సౌకర్యంగా ఉండేందుకు లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

పనులు పూర్తయిన తర్వాత వికారాబాద్ జంక్షన్‌ను ఉపయోగించే ప్రయాణికులకు అనేక కొత్త సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సీటింగ్ ఏరియాల్లో ఆధునిక కుర్చీలు, పరిశుభ్రతతో కూడిన రెస్ట్రూమ్‌లు, వైఫై సదుపాయాలు, ఆధునిక ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డులు, అత్యవసర సహాయం కోసం హెల్ప్ డెస్క్‌లు వంటి అనేక సదుపాయాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

వికారాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ ఆధునికీకరణ పెద్ద వరంగా మారనుంది. వికారాబాద్ రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్, మహబూబ్‌నగర్, గుల్బర్గ, విట్‌ఛూర్, లతూర్ వంటి మార్గాలకు తరచుగా రైళ్లు నడుస్తున్నాయి. ఈ సౌకర్యాలతో ప్రయాణం మరింత సులభం, సౌకర్యవంతంగా మారబోతోంది.

Also Read: Bird landing video: పైలట్లకు స్పెషల్ క్లాస్ చెప్పిన పక్షి.. వీడియోను పోస్ట్ చేసిన హైదరాబాద్ సీపీ!

స్థానికులు, ప్రయాణికులు ఈ ఆధునికీకరణ పనులను హర్షిస్తున్నారు. వికారాబాద్‌ నుంచి ప్రతిరోజూ ప్రయాణించే ఒక ఉద్యోగి మాట్లాడుతూ.. ముందు ప్లాట్‌ఫార్మ్‌ల్లో సీటింగ్ సదుపాయాలు తక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్ని సదుపాయాలు మెరుగుపడుతుండటంతో చాలా సంతోషంగా ఉందన్నారు.

అమృత్ స్టేషన్ ప్రాజెక్ట్ లక్ష్యం కేవలం స్టేషన్లను అందంగా తీర్చిదిద్దడమే కాదు, ప్రయాణికులకు అత్యాధునిక సదుపాయాలు, సేఫ్టీ, పరిశుభ్రత, టెక్నాలజీ ఆధారిత సేవలు అందించడం. వికారాబాద్ స్టేషన్ కూడా ఈ జాబితాలో భాగం కావడంతో, తెలంగాణలో ప్రయాణ అనుభవం ఒక కొత్త స్థాయికి చేరుకోబోతోంది.

వికారాబాద్ జంక్షన్ ఆధునిక రూపంలో మారడం కేవలం ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ కాదు, ప్రయాణికుల సౌకర్యాల పెంపుకి తీసుకున్న ముందడుగు. పనులు పూర్తయ్యాక ఈ స్టేషన్ రాష్ట్రంలోనే ఒక మోడల్ స్టేషన్ గా నిలవడం ఖాయం. అమృత్ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైల్వే నెట్‌వర్క్ మరింత ఆధునికంగా, సౌకర్యవంతంగా మారబోతోంది.

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×