BigTV English

Visakha Metro: విశాఖ మెట్రో సరికొత్త రికార్డు.. తెలుసుకుంటే కాలర్ ఎగరేస్తారు!

Visakha Metro: విశాఖ మెట్రో సరికొత్త రికార్డు.. తెలుసుకుంటే కాలర్ ఎగరేస్తారు!

Visakha Metro: విశాఖపట్నం ఇప్పుడు మరో అద్భుత దశలోకి అడుగుపెడుతోంది. బీచ్‌ల అందం, పారిశ్రామిక వృద్ధికి ప్రసిద్ధి చెందిన ఈ నగరం.. ఇప్పుడు మెట్రో రైలు రూపంలో రవాణా రంగంలో విప్లవాన్ని చూడబోతోంది. మెట్రో అంటే సాధారణ రైలు అనుకుంటే పొరపాటు. విశాఖ మెట్రోలో వింతలు, విశేషాలు మెండుగా ఉన్నాయి. దేశంలో అరుదుగా కనిపించే డబుల్ డెక్కర్ ట్రాక్, భోగాపురం ఎయిర్‌పోర్ట్ వరకు విస్తరించనున్న మార్గం, కేజీ నుండి సాఫ్ట్‌వేర్ కంపెనీల వరకు కనెక్టివిటీ.


ఇలా అన్నీ కలిసొచ్చే ఈ ప్రాజెక్ట్ విశాఖ నగర చరిత్రలో మైలురాయి కావనుంది. అత్యాధునిక సాంకేతికత, ప్రజల సౌకర్యాలకు అనుగుణంగా రూపొందించిన ఈ మెట్రో రైలు నగర జీవనశైలినే మార్చేసే శక్తిని కలిగి ఉంది. ఇక ప్రయాణాలు వేగవంతం కానున్నాయి. కాలుష్యం తగ్గబోతోంది.. విశాఖ ప్రజల కలలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.

మెట్రో రాకమునుపే.. అన్నీవింతలే!    
విశాఖపట్నం నగరం ఇప్పుడు అభివృద్ధి గగనాన్ని తాకేందుకు రెడీ అవుతోంది. బీచ్‌ల ఒడిదుడుకుల సరదా, ఉత్పత్తి రంగాల ఉద్యమం మధ్య, ఇప్పుడు మెట్రో రూపంలో కొత్త ప్రయాణం మొదలవుతోంది. ఇది సాధారణ మెట్రో ప్రాజెక్ట్ కాదు. ఎన్నో వింతలు, విశేషాల కలయికతో విశాఖ మెట్రో ప్రాజెక్ట్ దేశంలోనే ప్రత్యేకమైనదిగా నిలవబోతోంది.


ఫస్ట్ టైమ్.. విశాఖలోనే
దేశంలోనే మొట్టమొదటిసారిగా రెండు డెక్కర్లతో ఉన్న వంతెనపై మెట్రో రైలు పరుగులు తీయబోతోంది. పైన మెట్రో, క్రింద ఇతర వాహనాల రాకపోకలతో దీన్ని డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ గా రూపొందిస్తున్నారు. ఇది విశాఖ నగరానికి గర్వకారణమే కాదు, దేశవ్యాప్తంగా నగర రవాణా పథకాలలోనూ ప్రేరణ అవుతుంది.

3 మార్గాల్లో.. మెట్రో విస్తరణ!
ఈ మెట్రో పథకం మొత్తం 76.9 కిలోమీటర్ల పొడవులో 3 మార్గాల్లో విస్తరించబోతోంది. ఇందులో మొదటి దశలో గాజువాక – శిల్పారామం మార్గం, సింహాచలం మార్గం, ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి రుషికొండ వరకు మెట్రో రైలు నడవబోతోంది. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో లింక్ తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అంటే, విమాన ప్రయాణికులు నేరుగా మెట్రోతో విమానాశ్రయానికి చేరుకునే సదుపాయం కలగనుంది.

సోలార్ ప్యానెల్.. అన్నీ అద్భుతాలే!
ఇక వింతలు ఇదివరకు మాత్రమే కాదు.. ఈ మెట్రో గ్రీన్ ఎనర్జీపై కూడా ఆధారపడనుంది. స్టేషన్లపై సోలార్ ప్యానెల్ లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఖర్చును తగ్గించడంతో పాటు, పర్యావరణానికి మేలుగా మారబోతోంది. స్మార్ట్ ఎనర్జీ యూజ్, ఎన్విరాన్‌మెంట్‌ ఫ్రెండ్లీ ఆపరేషన్స్‌తో విశాఖ మెట్రో గ్రీన్ మెట్రోగా పేరుతెచ్చుకునే అవకాశం ఉంది.

ప్రయాణికులకు మరింత అనుకూలంగా, ఆధునిక టికెట్ సిస్టమ్, మొబైల్ యాప్‌ల ద్వారా టికెట్ బుకింగ్, స్మార్ట్ కార్డులు, ఏఐ ఆధారిత పాస్‌జర్ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లు అమలు చేయనున్నారు. దీని ద్వారా మెట్రో ప్రయాణం వేగవంతంగా, సురక్షితంగా, సమర్థవంతంగా మారనుంది. పిల్లల చదువులు, ఉద్యోగాలకు వెళ్లే యువత, వ్యాపార అవసరాలతో నిత్యం ప్రయాణించే వాణిజ్యవేత్తలు, టూరిస్టులు.. అందరికీ ఇది ఒక గొప్ప గిఫ్ట్. ఉదయం నుంచి రాత్రివరకు బస్సుల కోసం వేచి ఉండే రోజులు పోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read: Dwacra Womens Schemes: ఏపీలో బంపర్ ఆఫర్.. వడ్డీ తగ్గించి మరీ రుణాలు.. డోంట్ మిస్ దిస్ ఛాన్స్!

విశాఖ మెట్రో నిర్మాణానికి రూ.14,300 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేయగా, మలేషియా, సింగపూర్, జర్మనీ వంటి దేశాల టెక్నాలజీ భాగస్వామ్యంతో పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ (APMRC) అధ్వర్యం వహిస్తోంది. ప్రధానంగా మూడు మార్గాల్లో గాజువాక – ఎన్‌ఎడీ – ఆర్టీసీ కాంప్లెక్స్ – శిల్పారామం, గాజువాక – గోపాలపట్నం – సింహాచలం – హనుమంతవాక, ఆర్టీసీ కాంప్లెక్స్ – మధురవాడ – రుషికొండ – భోగాపురం ఎయిర్‌పోర్ట్ తదుపరి దశలో నిర్మాణం సాగనుంది.

మెట్రోతో.. ఆ సమస్యకు చెక్
ఈ మెట్రో ద్వారా రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉందని అంచనా. కాలుష్యంపై ఈ మెట్రో వదిలే ప్రభావం కూడా చాలా కీలకం. నగరంలో దట్టంగా ఉండే ట్రాఫిక్ సమస్యకు ఇది శాశ్వత పరిష్కారంగా మారనుంది. ఇది కేవలం రవాణా ప్రాజెక్ట్ కాదు. విశాఖ అభివృద్ధికి ఒక కొత్త చాప్టర్. ఇది నగరాన్ని మోడర్న్ యుర్బన్ ట్రాన్సిట్ హబ్‌గా మార్చబోతోంది. స్కూల్ విద్యార్థుల నుండి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల దాకా.. ప్రతి ఒక్కరినీ చేరుస్తూ, విశాఖ జీవనవిధానాన్ని మార్చబోతుంది.

విశాఖ మెట్రో పనులు 2025 చివరికల్లా పూర్తి చేసి, 2026లో ప్రయాణికుల సేవలకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ఇది ఒకసారి ప్రారంభమైతే.. విశాఖపట్నం ట్రాన్స్‌పోర్ట్ రంగంలో జరగబోయే మార్పు చూస్తే, అందరూ ఒక్క మాటే చెబుతారు ఇది నిజంగా విశాఖ చరిత్రలో మైలురాయి!

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×