Intinti Ramayanam : స్టార్ మా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రతి ఇంట్లో జరిగే కుటుంబ కథా స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఈ సీరియల్ లో నటించిన గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఈ సీరియల్ లో పల్లవి ఎప్పుడూ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ పల్లవి బుద్దిని మార్చుకోవడం మాత్రం చెయ్యదు.. అయితే ఈ మధ్యకాలంలో పల్లవి మారినట్లు సీరియల్ లో కనిపిస్తుంది. పల్లవిలోని మార్పు జనాలకి కాస్త ఆలోచనలు పడేలా చేసినా కూడా సీరియల్ కి మాత్రం ఆమె నటన ప్రస్తుతానికి హైలైట్ గా మారింది.. ఈ సీరియల్ నుంచి అవని తప్పుకుంటుంది అంటూ వార్త వినిపిస్తుంది. అవని వేరే సీరియల్ లో బిజీగా ఉండటంవల్ల ఈ సీరియల్ కి బ్రేక్ తీసుకుంటుంది అని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. మరి నిజంగానే అవని సీరియల్ నుంచి తప్పుకుంటున్న లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అసలు నిజమేంటో ఒకసారి మనం తెలుసుకుందాం..
తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి సీరియల్ లో అవని క్యారెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అవని ఎంత సౌమ్యంగా కుటుంబాన్ని చాకచక్యంగా నడిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎటువంటి గొడవలు జరిగిన కూడా అవని తన తెలివితో అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.. అయితే పల్లవి ఒకప్పుడు అవనిని దెబ్బ కొట్టాలని ఎన్ని ప్లాన్లు వేసిన సరే అవని మాత్రం వాటిని ముందుగా తెలుసుకొని పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తూ వస్తుంది. అవని క్యారెక్టర్ లో నటిస్తున్న నటి పేరు పల్లవి రామిశెట్టి.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ప్రస్తుతం ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది.. ఇటీవల అవనీ క్యారెక్టర్ ను సీరియల్ నుంచి తీసివేస్తారా? అన్న ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపించాయి. అయితే ఈ వార్తలపై ఎక్కడ పల్లవి రామిశెట్టి స్పందించి క్లారిటీ ఇవ్వలేదు. ఇవి కేవలం గాలి వార్తలే అని తేలింది.. ఇప్పుడు మరోసారి అవని ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల కైనా ఆమె క్లారిటీ ఇస్తుందేమో వేచి చూడాలి..
పల్లవి రామిశెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. భార్యామణి,ఆడదే ఆధారం బండి సూపర్ హిట్ సీరియల్స్లలో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సీరియస్ కి కాస్త గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.. ఒక బాబు పుట్టిన తర్వాత మళ్లీ సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది.. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సీరియల్స్ ఉన్నాయి. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి రామాయణం సీరియల్ తో పాటుగా, ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీ లో ప్రసారమవుతున్న జానకి పరిణయం సీరియల్ లో నటిస్తుంది. అంతే కాదు ఈ సీరియల్స్ కి ఈమె ఒక్క రోజుకి తీసుకునే రెమ్యూనరేషన్ దాదాపు 40 వేల వరకు ఉంటుందని సమాచారం.. నెలలో 25 రోజులు షూటింగ్ ఉండడంతో ఈమె ఆదాయం నెలకి లక్షల్లోనే ఉంటుంది అని తెలుస్తుంది.. మరి ఈమె ఒక్క నెలకి ఎన్ని లక్షలు సంపాదిస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.