Gundeninda GudiGantalu Today episode August 12th : షీలా ఇంకా ఇంటికి రాలేదేంటి అని బాలు కంగారు పడిపోతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. తను ఇంకా రాలేదేంటి ఎక్కడికి వెళ్ళింది ఇంతసేపు ఏమైంది అని అటు ఇటు తిరుగుతూ బాలు ఆలోచిస్తూ ఉండగా.. మీనా మావయ్య గారి బదులు మీరే వెళ్లి ఉండొచ్చు కదా అని అంటుంది.. అంతలోపే సుశీలమ్మ ఇంట్లోకి రాగానే బాలు షీలా డార్లింగ్ అంటే చాలా సంతోషంగా వెళ్లి తనని లోపలికి తీసుకొని వస్తాడు.. ఇక మనోజు ఎలా ఉన్నారు అని అడిగినా కూడా సుశీలమ్మ అసలు మాట్లాడకుండా వెటకారంగానే సమాధానం చెబుతుంది. ఇక బాలు మనోజ్ అలాగే సత్యం ముగ్గురు కలిసి రోహిణి ప్రభావతుల గురించి అడగ్గానే సుశీలమ్మకి నిజాలు చెప్తారు..
రోహిణి ఎక్కడ అని అడిగినా కూడా మనోజ్ ఏమి సమాధానం చెప్పకపోవడంతో సుశీలమ్మ దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. ఇక రోహిణి మనోజ్ ఎప్పుడు ఫోన్ చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది. వెంటనే మనోజ్ ఫోన్ చేయడం చూసి బెట్టు చేస్తుంది రోహిణి. ఏంటి మనోజ్ ఫోన్ చేస్తుంటే నువ్వు మాట్లాడను అని అంటున్నావు. తను ఫోన్ చేసినా నువ్వు మాట్లాడను అని అంటే తను ఇంకా జన్మలో నీకు ఫోన్ చేయడు అని విద్య అంటుంది… మొత్తానికి సుశీలమ్మ ఇంట్లోకి రాగానే సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం అయ్యేలా కనిపిస్తాయి..
బామ్మ రోహిణి కి ఫోన్ చేయమని చెప్పింది అని ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి మాత్రం బెట్టు చేస్తూ నేను ఫోన్ లిఫ్ట్ చేయను అని అంటుంది.. అయితే మళ్లీ మనోజ్ ఫోన్ చేయడంతో రోహిణి లిఫ్ట్ చేస్తుంది. ఒకరికి ఒకరు మాట్లాడుకోవాలని అనుకున్న కూడా వాళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితి ఉండడంతో ఇద్దరు ఒకరినొకరు ముందుగా సైగల్తో మాట్లాడుకుంటారు. ఇక మొత్తానికి మనోజ్ రోహిణి తో మాట్లాడటం ఇష్టం లేకపోయినా సరే బామ్మ చెప్పింది అని మాట్లాడుతాడు.. నువ్వు ఇంటికి రావాలి అని అనగానే రోహిణి చాలా సంతోషంగా ఉంటుంది.. ఇప్పుడు నువ్వు నన్ను ఇంటికి రమ్మని పిలుస్తున్నావా? అని అడుగుతుంది.. బామ్మ రమ్మని పిలిస్తేనే నువ్వు పిలిచావా నీకు నేనంటే ఇష్టం లేదా అని రోహిణి చాలా బాధపడిపోతుంది.. లక్ష మోసాలు చేసిన నిన్ను ఎలా నమ్ముతాను. బామ్మ రమ్మంది వస్తావా రావా అని మనోజ్ అడగ్గానే వస్తాను అని అంటుంది రోహిణి..
రోహిణి ప్రభావతి ఇద్దరూ ఎదురెదురుగా ఆటోలలో దిగుతారు. అయితే ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడి మాట్లాడుకోకుండా చూసుకుంటారు.. ప్రభావతి చూపులకి రోహిణి భయపడుతుంది.. రోహిణి ప్రభావతి తో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రభావతి మాత్రం చాలా చిరాగ్గా ఉంటుంది.. ప్రభావతి ఎక్కిన ఆటో డ్రైవర్ దగ్గర చిల్లర లేకపోవడంతో.. చిల్లర అన్న నాకు చిల్లర మనుషులు అన్న చాలా చిరాకు.. చిల్లర లేకపోతే నువ్వే తీసుకురా అని అంటుంది. రోహిణి నా దగ్గర ఉంది అని చెప్తున్నా సరే ప్రభావతి మాత్రం ఆగు నాకు చిల్లర మనుషులంటే అసహ్యం అని అంటుంది.. కనీసం రోహిణి ఎక్కిన ఆటో డ్రైవర్ దగ్గర కూడా ప్రభావతి చల్లని తీసుకోవడానికి ఒప్పుకోదు.. డ్రైవర్ని 500 తీసుకోమని చెప్పి అక్కడి నుంచి లోపలికి వచ్చేస్తుంది.
వీళ్ళిద్దరి ఇంకా రాలేదు ఏంటి అని షీలా అడుగుతుంది.. ఒకరు లక్షలు మింగినోడు మరొకరు లక్షల కోసం ఆశపడినోళ్లు ఇంకా రాలేదేంటి అని బాలు కూడా వాళ్ళిద్దరి మీద సెటైర్ల వర్షం కురిపిస్తాడు.. అప్పుడే ఇద్దరు అత్త కోడలు గుమ్మం దగ్గర నిలబడి ఉండడం చూసి ఇంట్లోని వాళ్ళందరూ కూడా అత్తా కోడలు ఒకేసారి వచ్చేసారా అని అనుకుంటారు. ఇక సుశీలమ్మ తన కోడలు చాలా కోపంగా ఉందని కూల్ అయ్యేందుకు నా కోడలు ప్రభావతి బొద్దుగా ముద్దుగా చాలా బాగుంటుంది.. పెళ్లిలో బాగా రెడీ అయింది. కాబట్టి దానికి దిష్టి తగిలింది. అందుకే గొడవ అయింది కాబట్టి మీరందరూ దిష్టి తీయాలి అని ముగ్గురు కోడలికి చెప్తుంది. శృతి మీనా ఇద్దరు కూడా ప్రభావతికి దిష్టి తీయడానికి అన్ని సిద్ధం చేస్తారు అది చూసి ప్రభావతి మురిసిపోతుంది.. తన అత్తయ్య తనని పొగిడింది అని చాలా సంతోషంగా ఉంటుంది.
రోహిణి పై ప్రభావతి రెచ్చిపోతుంది. సుశీల కోడలు కదా మాట్లాడి పరిష్కరించుకోవాలి కదా.. అత్తగానికా బాధ్యత లేదా అని అంటుంది.. అయితే రోహిణి చూసిన ప్రభావతి రోహిణిని చంపలు వాయించేస్తుంది.. ఒకవైపు సుశీల ఎంతగా ఆపాలని ప్రయత్నించినా సరే ప్రభావతి మాత్రం అసలు వినకుండా రోహిణిని దారుణంగా కొడుతుంది.. కానీ మనోజ్ మాత్రం రోహిణి మలేషియా నుంచి రాలేదు అని నాకు ముందే తెలుసు అని అంటాడు.. ఆ మాట వినగానే ఇంట్లోని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.
నీకు ముందే తెలిస్తే నాకు ఎందుకు చెప్పలేదు రా నీ ప్రభావతి మనోజ్ పై రెచ్చిపోయి మరి కొట్టేస్తుంది.. అది అబద్ధాలు అని చెప్తున్నా కూడా నువ్వు వాటిని పెంచి పోషిస్తున్నావా..? ఎందుకు నువ్వు ఇలా చేశావు చవట దద్దమ్మ పెళ్ళాం చేతిలో మోసపోయినోడు అని దారుణంగా తిట్టేస్తుంది ప్రభావతి. అయితే రోహిణి నిజం చెప్పింది అని అంటే నాకు డౌటే అని మీనా అనగానే.. నిజంగానే మీనా నాకు రోహిణి ఎప్పుడో చెప్పింది అమ్మకి వచ్చిన కోపం చూసావు కదా అందుకే నేను ఆ నిజాన్ని చెప్పలేదు అని మనోజ్ అంటాడు. ఇక సుశీలమ్మ ప్రభావతిని కూల్ చేస్తుంది.. ఇక రోహిణి ఎందుకు నువ్వు ఇప్పుడు ఇన్ని మోసాలు చేశావు అని సుశీల అడగగానే మనోజ్ ని నేను ప్రేమించాను అని చెప్తుంది. రోహిణి ఎమోషనల్ మాటలు విన్నా సుశీలమ్మ బాధపడుతుంది. కానీ రోహిణి చెప్పే మాటలు మాత్రం ఎవ్వరు నమ్మరు. రోహిణి చెప్పిన ఎమోషనల్ మాటలని అందరూ విని షాక్ అవుతారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ప్రభావతి రోహిణిని క్షమిస్తుందా? సుశీలమ్మ మాటని వింటుందా? మనోజ్ రోహిణి మళ్లీ కలిసిపోతారా అన్నది చూడాలి..