Telugu TV Serials: తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వాటిలలో ఎక్కువగా సీరియల్స్ ఉన్నాయి.. ఒకప్పుడు సీరియల్స్ ని చూడాలి అంటే చాలామంది బోరింగ్ గా ఫీల్ అయ్యే వాళ్ళు కానీ ఈ మధ్య కొత్త సీరియల్స్ రావడంతో వాటిని చూసేందుకు జనాలు ఎగబడిపోతున్నారు. ఈమధ్య వస్తున్న సీరియల్స్ స్టోరీలు మాత్రం డిఫరెంట్ గా ఉండడంతో ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులు వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గత వారంతో పోలిస్తే ఈ వారం సీరియల్స్ టిఆర్పి రేటింగ్ కాస్త పెరిగినట్లు తెలుస్తుంది.. ఈ క్రమంలో సూపర్ హిట్ సీరియల్కు శుభం కార్డు పడబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హిట్ సీరియల్ ఏది? ఎందుకు సీరియల్ కు ముగింపు
తెలుగులో ఇప్పటికీ ఎన్నో సీరియల్స్ ప్రసారమవుతున్నాయి.. వీటిల్లో కొన్ని సీరియల్స్ మొత్తం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని వస్తున్నాయి. ఈ మధ్య కొత్త సీరియల్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి.. వీటిలో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ కథ కొన్ని రోజులుగా అనేక ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. అనాధ అయినటువంటి ఒక కుటుంబ పెద్ద.. ఒక మంచి కుటుంబం ఏర్పాటు చేసుకుంటాడు. ఆ కుటుంబం తనకి ఎంతో సంతోషాన్నిస్తుంది. అలాగే ఎంతో బాధని కూడా మిగిలిస్తుంది. అలాంటి సీరియల్ ఇప్పుడు ఎమోషనల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. అయితే వల్లి తన గురించి నిజం చెప్తే ఈ సీరియల్ అక్కడితో ఎండ్ అవుతుంది అని వార్త ప్రస్తుతం వినిపిస్తుంది. అందుకు కారణం వల్లి కోసం నర్మదా తెప్పించిన లైవ్ డిటెక్టర్.. ఇది గనక వల్లికి పెడితే తను ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని బయట పడుతుంది. ఆ తర్వాత సీన్ ఏ విధంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. అలా ఈ విషయం బయట పడిన వెంటనే శుభం కార్డు పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో ఇలాంటి వార్తలు అనేకసార్లు వినిపించాయి కానీ అవన్నీ పుకార్లు మాత్రమే అని తేలింది. ఇప్పుడు కూడా అలాంటి వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని ఎపిసోడ్లు పూర్తి వరకు వెయిట్ చేయాల్సిందే..
Also Read :జూన్ చివరివారంలో సినిమాల సందడి.. రీ-రిలీజ్లదే జోరు..!
ఒక అనాదగా ఎన్నో అవమానాలను అనుభవిస్తూ కస్సుతో పైకొచ్చిన వ్యక్తి రామరాజు.. ఒక ఇంట్లో పనికి చేరుతాడు. రామరాజు మానసత్వం బాగా నచ్చిన ఆ ఇంటి రెండవ కోడలు అతనితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఆ కుటుంబాల మధ్య పచ్చ గడ్డి వేసిన కూడా భగ్గుమనేలా మారుతాయి. రెండు కుటుంబాలు ఎదురెదురుగా ఉన్నా కూడా ప్రేమగా పలకరించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.. అయితే రామరాజు కుటుంబంలో పిల్లలు వస్తారు.. మూడవ కొడుకు కూడా తన భార్య పుట్టింటి నుంచి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తను హ్యాపీగా ఉన్న ఆ అమ్మాయి మాత్రం చాలా బాధపడుతూ కనిపించింది… తన చెల్లెలు అలాగే తన మేనకోడలు ఆ రామరాజు ఇంటికి కోడలుగా వెళ్లారు అని భద్రావతి తెగ బాధ పడిపోతూ ఉంటుంది.. తన కుటుంబాన్ని ముక్కలు చేసిన రామరాజును మాత్రం అస్సలు వదలను అని భద్ర ఎప్పటికప్పుడు ప్లాన్లు చేస్తుంది. కానీ రామరాజు మంచితనం తన కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చింది.. అలా ఆ సీరియల్ లో ప్రస్తుతం గందరగోళ పరిస్థితులను భద్ర క్రియేట్ చేసిన కూడా రామరాజు కొడుకులు మాత్రం తన తండ్రికి మాట పోకుండా చేస్తూ ఉంటారు.. ఇక ఇప్పటికీ కూడా ఆ రెండు కుటుంబాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంటుంది.. మరి సీరియల్ ఎండింగ్ లోపల ఈ రెండు కుటుంబాలు కలుస్తాయా లేదా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.. ఒకవేళ ఈ సీరియల్ వెనక అయిపోతే నెక్స్ట్ కొత్త సీరియల్ రాబోతుంది అని తెలుస్తుంది.