Gundeninda GudiGantalu Today episode August 7th : మనోజ్ వెర్రివాడు లాగా అన్ని పిచ్చిపిచ్చిగా చూస్తూ కిందకి వస్తాడు. మనోజ్ చేస్తున్న ప్రవర్తన అతని చూపులు చూసి మీనా బాలు ఇద్దరు కూడా షాక్ అవుతారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారు. వీడు ఏదో చేస్తున్నాడు మనోజ్ దగ్గరికి వెళ్లి చంప పగలగొడతాడు. ఆ తర్వాత స్పృహలోకి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇక తర్వాత బాలు మీనా సత్యం ముగ్గురు కలిసి రోహిణి గురించి ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా కూడా మనోజ్ వినకపోవడంతో అందరూ షాక్ అవుతారు కానీ ప్రభావతి దగ్గరికి వెళ్లిన సత్యం మాత్రం రోహిణి గురించి ఎంత చెప్పినా సరే తను మాత్రం వినకుండా సీరియస్ అవుతుంది.
రోహిణి ఎంత మాట్లాడుతున్నా కూడా విద్య మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఇప్పటివరకు నీలో మోసం అబద్ధం చెప్పావ్ అనుకున్నాను కానీ ఇంత క్రూరంగా మారిపోతావు అని అస్సలు ఊహించలేదు అని విద్య అంటుంది. నేను ఇష్టపడి కోరుకున్న జీవితాన్ని అంత తొందరగా ఎందుకు వదిలిపెడతానో అసలు వదిలే ప్రసక్తి లేదు అని విద్య తో రోహిణి అంటుంది. ఇప్పటికీ నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నావా..? కొంచమైనా ఆలోచించవే ఇకమీదట నీకు ఆ ఇంట్లో చోటు లేదు. మీ అత్తయ్య నేను మనిషిలాగా చూస్తుందని అనుకుంటున్నావా? ఈరోజు నీకు ఎంత చెప్పానని చూసినా సరే.. తను మాత్రం ఆస్తులు వినకుండా అది నా ప్రపంచం పరువు కోసమే నన్ను తీసుకెళ్తారు అని ధీమాగా మాట్లాడుతుంది..
అసలు ఆ రోహిణి పరిచయం అవడానికి కారణమైన కామాక్షిని అస్సలు వదిలిపెట్టను అని ప్రభావతి చాలా కోపంగా కామాక్షి ఇంటికి వెళుతుంది.. నీవల్లే నేను మోసపోయాను నువ్వు ఇదంతా చేసింది అని అనగానే కామాక్షి భయపడిపోతుంది. నువ్వు ఎంతగా నన్ను నమ్మించి మోసం చేశావు అంటూ ప్రభావతి పరిగెత్తించి ఉంటే కొడుతుంది. కానీ వదిన నాకు రోహిణికి ఏ సంబంధం లేదని జస్ట్ చూపించాను.. మీరే దాని ఏరి కోరి పెళ్లి చేసుకున్నారు అని చెప్పగానే.. మనోజ్ జీవితాన్ని నాశనం చేశాను అని ప్రభావతి బాధపడిపోతుంది. నువ్వు చేసింది తప్పే కానీ ఇంత మోసం చేస్తుందని అసలు అనుకోలేదు కదా అని కామాక్షి ప్రభావతిని శాంతింప చేస్తుంది. కానీ కామాక్షి మంత్రం అసలు వినకుండా మాట్లాడడంతో ప్రభావతి మళ్లీ తనపై సీరియస్ అవుతుంది. ఇక చివరికి కామాక్షిని వదిలేసి ప్రభావతి మనోజ్ గురించి ఆలోచించి చాలా ఫీల్ అయిపోతుంది.
మనోజ్ పరిస్థితిని చూసి ఇంట్లో ఇల్లా జరుగుతుంది అంటే నాకు చాలా భయంగా ఉంది అని సత్యం అంటాడు.. ఎలా ఉంటాడో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు సత్యం.. మనోజ్ మళ్లీ మనుషులకే మారాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి ఒకటి అమ్మను ఒప్పించాలి. లేదంటే ఆ రోజు నేను మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తేనే మనోజ్ మారతాడు అని బాలు మీనా అనుకుంటారు.. అమ్మ మన మాట వినదు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి అని బాలు ఉంటాడు.. మనం ఏం చేసినా కూడా అమ్మ సీరియస్ అవుతుంది తనని ఒప్పించకుండా మనం తను చెప్పిన మాట వినేలా చేసుకోవాలి అని బాలు తో సత్యమంటారు.. సత్యం మాట విన్న బాలు మనం అమ్మని కంట్రోల్ లో పెట్టాలి అంటే ఒక్క షీల డార్లింగ్ అవుతుంది. తనని ఇక్కడికి దించితే ఈ పరిస్థితి మెరుగుపడుతుంది అని బాలు సుశీల్ అనే రంగంలోకి దింపే ప్లాన్ చేస్తాడు. ఇక మీనా అవునండి మీరు చెప్పింది కూడా నిజమే అమ్మమ్మ గారు ఇక్కడికి వస్తేనే ఈ పరిస్థితి బాగోతుంది అని చెప్తుంది.
రోహిణి తనని మోసం చేసిందని బాధపడుతున్న మనోజ్ ఎలా అయినా సరే ఈరోజు తాగేసింది సమాధానం మర్చిపోవాలి అని అనుకుంటాడు. తన ఫ్రెండ్ మణికంఠతో కలిసి బారుకు వెళ్లి ఫుల్లుగా తాగేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు.. ఈ క్రమంలో అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి మనోజ్ మణికంఠ ఇద్దరూ కూడా దొరుకుతారు. మనోజ్ తన తింగరితనంతో అట్టదిడ్డంగా మాట్లాడేసి పోలీసులతో దొరికిపోతాడు. ఇక మణికంఠ మనం పోలీసులకు దొరికిపోయామని బాధపడిపోతూ భయపడిపోతూ ఉంటారు.. అది కూడా అరుణ్ కి దొరకడంతో ఇక బాలుకి చుక్కలు చూపిస్తారేమో అని అర్థమవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో బాలు మీ మనస్సు కాపాడతాడా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారంది.. ఇక ముందు ఎపిసోడ్స్ లలో ఎలా ఉండబోతుందో చూడాలి..