Podarillu Today Episode august 7th: మనిషా గుడికి వెళ్లి మాధవ్ దొరకాలి అని దండం పెట్టుకుంటూ ఉండగా అక్కడ మాధవిని చూసి మనీషా ఒక్కసారిగా షాక్ అవుతుంది.. మాధవ్ జి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? మీకోసం ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు అని చెప్తూ ఉంటే మాధవ్ నేను ఇక్కడ ఉన్నాను సంగతి చెప్పొద్దు అని చెప్తాడు.. ఇక మనిషా మా ఇంటికైనా వెళ్దాం రండి అని అతని తీసుకొని ఇంటికి వెళుతుంది.. ఇక మనిషి ఇంటికి వెళ్ళిన తర్వాత భన్సీ ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటాడు.. అయితే తాను ఇక్కడే ఉన్నానన్న సంగతి ఎవరికీ చెప్పకుండా ఉండాలి అని మాధవ్ ఒట్టేసుకుంటాడు.. మొత్తానికి మాధవ్ అక్కడే ఉండడం ఇష్టమేని చెప్పడంతో మనిషా అతనికి సేవలు చేస్తూ ఉంటుంది.
కన్నా అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని బాధ పడిపోతుంటే.. మహా కన్నాను ఓదారుస్తూ కనిపిస్తుంది. కన్న ను ఎంతగా ఓదార్చాలని చూసిన కూడా తను మాట వినకుండా బాధపడతాడు. నేనంటే ఇష్టం లేదు.. అందుకే అన్నయ్య వెళ్ళిపోయాడు అని కన్నా కన్నీళ్లు పెట్టుకుంటాడు. చక్రీ ఎంతగా ఓదార్చాలని ప్రయత్నాలు చేస్తున్న సరే అతను మాత్రం అమ్మ దూరమైందని బాధ పడతాడు.. మహాలక్ష్మి ఎంతటి ఓదార్పు చాటింగ్ చేసినప్పుడు తను మాత్రం అసలు వినకుండా భోజనం కూడా చేయకుండా బాధపడిపోతూ ఉంటారు.. ఒకవైపు చక్రీ కన్నా ని చూసి ఏమైపోతారో అని కంగారు పడిపోతూ ఉంటారు.. కేశవ కూడా ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.. కన్నా బాధని చూస్తున్న కేశవ ఎలాగైనా సరే అమ్మాయిని తీసుకుని వస్తానని వెళ్లిపోతారు.
మహాలక్ష్మి, చక్రీ ఇద్దరు కూడా మల్లీ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒకసారి కనుక్కోవాలి అనుకుంటారు. కానీ చక్రీ మాత్రం నేను ఆ పోలీస్ దగ్గరకు చచ్చినా రాను అని అంటాడు. మీ అన్నయ్య దొరకడం మీకు ఇష్టం లేదా.. ఎందుకు ఇలా మొండిగా ఉంటారు అని మహా క్లాస్ పీకుతుంది. అటు కేశవ కూడా పోలీసులకే అన్న ఎక్కడున్నాడు అన్న సంగతి తెలుస్తుంది. నువ్వు మహా లక్ష్మీ చెప్పినట్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లడం బెస్ట్ అని అంటాడు.. అయితే మహా లక్ష్మీకి బన్సీకి నిన్న చెప్పాము కదా.. ఒకసారి కానీ కూడా అడిగితే బాగుంటుంది కదా అని మహాలక్ష్మి అంటుంది. నాకెందుకు మహాలక్ష్మి వాళ్ళింట్లోనే మాట ఉంటాడు అని అనగానే అందరికీ అనుమానం మొదలవుతుంది..
మాధవ్ బన్సీ వాళ్ల ఇంట్లో ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు అని మాట తీసుకుంటాడు.. మనీషా కూడా ఇంట్లో వాళ్ళందరూ బాధపడిపోతున్నారు. నీ అంత చెప్పినా సరే మాధవ్ మాత్రం నువ్వు సంతోషం కోసమే నేను ఎలా చేస్తున్నాను. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటారు. కానీ ఎవరు ఎంత చెప్పినా కూడా మాతో మాత్రం అస్సలు వినకపోవడంతో మౌనంగా ఉండిపోతారు. మధులతో మాట్లాడుతున్న మాటలను చక్రి దూరంగా ఉండే వింటాడు. నువ్వు చాలా త్యాగమూర్తివీ అన్నయ్య నువ్వు మా కోసం అన్ని చేశావు కానీ మేము ఏమి చెయ్యలేదు. నువ్వు లేని ఆ ఇంట్లో మేము ఎలా ఉంటాము అని అంటాడు. ఆ మాట వినగానే చక్రీ కన్నీళ్లు పెట్టుకుంటాడు. మాధవ్ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడతాడు. ఎంతగా చెప్పాలని చూసిన కూడా మొదట వినకపోయిన ఆ తర్వాత వింటాడు.
మాధవ్ ఇంటికి రాగానే ఇంట్లోనే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. ఎందుకు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అని బాధపడిపోతూ ఉంటారు. కేశవ మహాలక్ష్మి ఇద్దరు కూడా ఒక మాటలకు మాధవని బాధపెట్టేస్తారు. నీకోసం బృందావనం ఎదురు చూస్తున్న పెద్ది లోపలికి వెళ్ళు అని మహాలక్ష్మి అనగానే మాధవ్ చాలా ఎమోషనల్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిన తర్వాత కన్నా ఈయన మా అన్నయ్య కాదు మమ్మల్ని వదిలేసి వెళ్లి అతను మా అన్నయ్య నవ్వుతాడు అని ఎమోషనల్ డైలాగులతో అందరిని ఏడిపించేస్తాడు.. ఎపిసోడ్కి ఈ సీన్ హైలైట్ గా నిలుస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..