Podarillu Maneesha : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న పొదిరిల్లు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నలుగురు మగాళ్లున్న ఒక ఇంటికి ఆడపిల్ల వెళితే ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది అన్న స్టోరీతో ఈ సీరియల్ వచ్చింది.. స్టార్టింగ్ లో కాస్త స్లోగా నడిచిన కూడా ఇప్పుడు మాత్రం జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. చక్రిమహాలక్ష్మి ఇద్దరూ నిజంగా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని జనాల్లో ఒక ఆత్రుత మొదలైంది. ఈ సీరియల్ మొత్తం వీళ్లిద్దరి స్టోరీ కి లింక్ ఎలా ఉంటుందో లేదా అన్న సస్పెన్షన్ అవుతుంది. ఈ సీరియల్లో ఇటీవల కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే… కేశవ కి జోడి గా శైలు ఎంట్రీ ఇచ్చింది. అదేవిధంగా మాధవ్ కి జోడిగా మనీషా ఎంట్రీ ఇచ్చింది. ఈమె రియల్ లైఫ్ గురించి తెలుసుకొనేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. మనీష ఏం చదువుకుందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం…
పొదిరిల్లు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మనీషా కన్నడ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ. కన్నడలో పలు సీరియస్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో బాగా మెప్పించింది. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మనీషా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నటనపై ఆసక్తితో బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్స్ కు సెలెక్ట్ అయిందట. అలా వెనక్కి తిరిగి చూసుకోకుండా ఒక్కో సీరియల్ తో తన క్రేజ్ ని పెంచుకుంటూ ప్రస్తుతం తెలుగులోకి కూడా అడుగు పెట్టేసింది. మనిషా అసలు పేరు సుస్మిత సిద్ధప్ప. మంచి అన్నం కలిగినా ఈ అమ్మడు హీరోయిన్ కన్నా ఎక్కువగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె క్యారెక్టర్ మాధవ్ తో కనెక్ట్ ఎలా స్టోరీని క్రియేట్ చేశారు. తెలుగులో ఇది మొదటి సీరియల్ అయినా కూడా చాలా బాగా నటించి అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది.
Also Read : ‘జానకి పరిణయం ‘ విష్ణు జీవితంలో కష్టాలు.. కన్నీళ్లు పెట్టించే స్టోరీ..
కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సుష్మిత సిద్దప్ప తన అందం, నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ అమ్మడు 2018లో విడుదలైన రొమాంటిక్ డ్రామా ‘పుట్టరాజు లవర్ ఆఫ్ శశికళ’ చిత్రంతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. హీరోయిన్ మించిన అందంతో ఒక్కసారిగా బుల్లితెర ఆడియన్స్ ని తన వైపు తిప్పుకుంది.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లకు ఎంత డిమాండ్ ఉందో చెప్పనక్కర్లేదు. ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక మరికొన్ని రోజులు గనక ఈమె స్క్రీన్ మీద కనిపిస్తే తెలుగు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోతుందని చెప్పనక్కర్లేదు.. మనిషాక్ మొదటి సీరియల్ అయిన కూడా రెమ్యూనిరేషన్ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు అని తెలుస్తుంది. ఈమె ఒక్క రోజుకి దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం..