Gundeninda Gudigantalu : అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియస్లలో టక్కును గుర్తుకు వచ్చే పేరు గుండెనిండా గుడి గంటలు.. ఈ సీరియల్ లో నటిస్తున్న హీరో హీరోయిన్ల కోసం జనాలు ఎక్కువగా ఈ సీరియల్ ని చూస్తున్నారు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే గంధం పెట్టింది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఇలాంటి వార్తలు ఎన్ని వచ్చినా కూడా సీరియల్ యూనిట్ మాత్రం అసలు క్లారిటీ ఇవ్వలేదు.. అయితే ఇప్పుడు మరోసారి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజంగానే ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుందా అసలు ఫైనల్ స్టోరీ ఏముంటుంది అని జనాలు క్యూరియాసిటీతో గూగుల్లో తెగ వెతికిస్తున్నారు. మరి ఈ సీరియల్ ఫైనల్ స్టోరీ ఎలా ఉండబోతుంది అన్నది ఇప్పుడు కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం.
గుండె నిండా గుడి గంటలు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలు మీనాల జంటను చూడడానికి చాలా మంది జనాలు ఈ సీరియల్ చూస్తున్నారన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారంలో ఉన్నాయి. వీటితో పాటుగా బాలు మీనాలో బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఈ వార్తలు గురించి ఇప్పటివరకు బాలు గాని, మీనా కానీ ఎక్కడ స్పందించలేదు.. అయితే ఇప్పుడు ఈ సీరియల్ చివరి అంకానికి చేరుకుంది అంటూ మరోసారి నెట్టింట ఓ వార్త వినిపిస్తుంది.. ఈ నేపథ్యంలోనే ఈ సీరియల్ కి వెంటనే ఎండు కార్డు వెయ్యబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.. అయితే ఈ సీరియల్లో మీనా వరుసగా ఆర్డర్లు తెచ్చుకుంటూ అతి తక్కువ కాలంలోనే కోటీశ్వరులుగా మారిపోతుంది అంటూ టాక్ వినిపిస్తుంది. ఇక మీనా ఎదుగుదలను చూసిన రోహిణి ప్రభావతి ఇద్దరూ ఓర్వలేకపోతారు. కానీ ఫైనల్ గా మీనా సక్సెస్ చూపించడం అందరికీ గుణపాఠం లాగా మారుతుంది. ఇది ఈ సీరియల్ కి ఫైనల్ స్టోరీ.. మరి ఈ స్టోరీ ప్రకారం ఈ సీరియల్ పడుతుందా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఈ సీరియల్స్ స్టోరీ విషయానికొస్తే… మీనా తనకి ఒక కార్పొరేట్ కంపెనీలో ఫ్లవర్ డెకరేషన్ చేసే ఆర్డర్ వచ్చింది అని చాలా సంతోషంగా ఉంటుంది. ఆ ఆర్డర్ ని పూర్తి చేయాలి అంటే ఐదు లక్షల ముందుగా పే చెయ్యాలని మేనేజర్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. మీనాకు పోటీలో ఉన్న చింతామణి నేను కచ్చితంగా ఆర్డర్ ను పూర్తి చేస్తాను. ఐదు లక్షలు ఐదు నిమిషాల్లో కడతాను అని అంటుంది. ఈ విషయాన్ని బాలు ఇంట్లో చెప్పడంతో ప్రభావతి మీనా 5 లక్షలు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోను అని చెప్తుంది.. బామ్మ స్థలాన్ని తాకట్టు పెడతాను అని బాలు చెప్తాడు.. కానీ ప్రభావతి ఆ స్థలాన్ని అమ్మడానికి వీల్లేదు అని మీనా కి షాక్ ఇస్తుంది. మరి రేపటి ఎపిసోడ్లో మీనా బాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది సస్పెన్స్ గా మారింది.
Also Read :Podarillu Satya : ‘ పొదరిల్లు ‘ లో సత్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?