Gundeninda GudiGantalu Today episode August 8th : మనోజ్ పరిస్థితిని చూసి ఇంట్లో ఇల్లా జరుగుతుంది అంటే నాకు చాలా భయంగా ఉంది అని సత్యం అంటాడు.. ఎలా ఉంటాడో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు సత్యం.. మనోజ్ మళ్లీ మనుషులకే మారాలి అంటే మనం ఏదో ఒకటి చేయాలి ఒకటి అమ్మను ఒప్పించాలి. లేదంటే ఆ రోజు నేను మళ్ళీ ఇంటికి తీసుకొని వస్తేనే మనోజ్ మారతాడు అని బాలు మీనా అనుకుంటారు.. అమ్మ మన మాట వినదు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలి అని బాలు ఉంటాడు.. మనం ఏం చేసినా కూడా అమ్మ సీరియస్ అవుతుంది తనని ఒప్పించకుండా మనం తను చెప్పిన మాట వినేలా చేసుకోవాలి అని బాలు తో సత్యమంటారు.. సత్యం మాట విన్న బాలు మనం అమ్మని కంట్రోల్ లో పెట్టాలి అంటే ఒక్క షీల డార్లింగ్ అవుతుంది. తనని ఇక్కడికి దించితే ఈ పరిస్థితి మెరుగుపడుతుంది అని బాలు సుశీల్ అనే రంగంలోకి దింపే ప్లాన్ చేస్తాడు. ఇక మీనా అవునండి మీరు చెప్పింది కూడా నిజమే అమ్మమ్మ గారు ఇక్కడికి వస్తేనే ఈ పరిస్థితి బాగోతుంది అని చెప్తుంది.
ప్రభావతి తనని దారుణంగా తిట్టింది అని కామాక్షి మీనాకు ఫోన్ చేసి అసలు నిజం చెప్తుంది.. నన్ను ఇంత దారుణంగా ఎవరు తిట్టలేదు. మీ అత్త ఈ మాత్రమే నన్ను ఇంత దారుణంగా తిట్టింది అని చెప్పగానే అవునా పిన్ని అసలు ఏం జరిగింది పిన్ని అత్తయ్య గారు కోపం ఇంకా తగ్గలేదా ఏంటి అని నేను అడుగుతుంది. అత్తయ్య గారికి నిజంగా కోపం రావడానికి కారణం రోహిణి పై చాలా ప్రేమను పెంచుకుంది ఇప్పుడు తను ఇలా చేయడంపై చాలా ఫీల్ అవుతుంది అని మీనా అంటుంది. అత్తయ్య గారు చాలా కోపంగా ఉన్నారు ఎవరేం చెప్పినా కూడా వినడం లేదు. మనోజ్ జీవితం ఇలా మారిపోయింది అని ఆవిడ చాలా బాధపడిపోతున్నారు అని కామాక్షితో మీనా అంటుంది. ఇలా నేను అత్తయ్య గారిని ఎప్పుడూ చూడలేదు పిన్ని మీరే నచ్చజెప్పి ఎలాగోలాగా అత్తయ్య గారి ఇంటికి పంపించండి. నా మాట అస్సలు వినదు తన మాటలతో తన తిట్లతో నా చెవుల నుంచి రక్తం కూడా వచ్చింది అని కామాక్షి అంటుంది. ఒకసారి సత్యం అన్నయ్య ఫోన్ చేస్తే తనకి కోపం తగ్గుతుందేమో అని అనగానే సరే నేను ఒకసారి మామయ్య గారితో మాట్లాడుతాను అని మీనా అంటుంది.
రోహిణి చేసింది తప్పే కానీ ఇలా శిక్ష వేయడం తప్పే కదా తనకు పెళ్లయింది తన భర్త ఉన్నాడు అత్తయ్య గారి వల్లే ఆయన ఏం చెప్తే అది వింటున్నాడు. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినే పరిస్థితిలో లేరు కాబట్టి ఏదో ఒకటి చేసే వాళ్ళిద్దరిని కలపాలి అని నేనా బాధ పడిపోతూ ఉంటుంది. అది చూసిన బాలు మనమేం చేయగలం మన చేతులు ఏముంది. వారు చేసుకునేదే కదా అది ఏదో ఒకటి చేసే వాళ్ళని కలపాలి అని మేన అనగానే.. బాలు సరే ఏదో ఒకటి చేద్దాం లే నువ్వు ఏమి బాధ పడకు అని అంటాడు. నాకు ఆకలేస్తుంది ముందు పెట్టు అని అనగానే సరే పదండి మీకు అన్నం పెడతాను అని నేను అంటుంది. మా అమ్మకి ఎంత చెప్పినా సరే మా నాన్న చెప్పిన సరే వినదు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బాలు అంటాడు. ఇక శీల రేపు ఇంట్లోకి వస్తేనే ఈ గొడవలన్నీ సర్దుమలుగుతాయని వాళ్ళు చెప్పగానే మీనా మొదట కంగారుపడిన బామ్మ గారు వస్తే అందరూ సెట్ అవుతారు అని సంతోషపడుతుంది.
భార్య నన్ను మోసం చేసింది అని బాధపడిపోతూ మనోజ్ బీర్ కొట్టాలి అని బార్ కి వెళ్తాడు. అక్కడ తాగుతున్న బీరు కంటే అతని మాటలే ఎక్కువ అవుతాయి నా భార్య నన్ను మోసం చేసింది నేను ఇష్టమే ప్రేమించిన నా భార్య నన్ను మోసం చేసింది అంటూ గోల గోల చేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ మనోజ్తో సర్ది చెప్పే ప్రయత్నం చేసిన కూడా నా భార్య నన్ను మోసం చేసింది అంటూ అందరితో గొడవకు దిగుతాడు.. మనోజ్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు అని మణికంఠ తనని తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటాడు కానీ రోడ్ల వెంబడి మనోజ్ చేసిన హంగామా తో మణికంఠ షాక్ అవుతాడు. మనోజ్ నీలాగైనా సరే సేఫ్గా ఇంటిదగ్గర దిగబెట్టాలి అని అనుకోని వెళ్తూ ఉండగా అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటారు.. వాళ్ళని చూసి మనోజ్ ఇంకాస్త రెచ్చిపోతారు. ఒక బిజినెస్ మాన్ ని ఆపుతారా మీరు అంటూ మాట్లాడడంతో అక్కడ ఉన్నవాళ్లు వీడికి ఏమైంది వీడికి ఏమైనా పిచ్చెక్కిందా అని అనుకుంటారు.
ట్రాఫిక్ కానిస్టేబుల్ రోహిణి అని పిలవగానే మనోజ్ నువ్వు ఎక్కడున్నావో రోహిణి ఎక్కడికి వెళ్లావు రోహిణి ఏం చేస్తున్నావ్ రోహిణి అంటూ అక్కడున్న వాళ్ళందరికీ షాకిచ్చేలా మాట్లాడుతాడు. నన్ను నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు రోహిణి అని మనోజ్ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ రోహిణి మనోజ్ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇలా చేస్తున్నావు. అసలు ఎంత చెప్తున్నా సరే మనోజ్ మాత్రం వినకుండా నన్ను మోహిని మోసం చేసింది అని అనడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ అరుణ్ తో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడికి ఏమైనా పిచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు మణికంఠ ఏదో బాధలో ఉన్నాడు మనోజ్ ప్రవర్తన చూసి అరుణ్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లండి అని అంటాడు. మనోజ్ నీ పోలీసులు అరెస్ట్ చేస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమ వారం ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..