Hyper Aadi: జబర్దస్త్ కామెడీ షోలో కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు హైపర్ ఆది (Hyper Aadi). ఎప్పుడూ అదిరిపోయే పంచ్ డైలాగులతో సోషల్ మీడియాలో రచ్చ లేపే ఈయన.. అటు సినిమాలలో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకుంటూ ఇటు షోలలో సందడి చేస్తూ బిజీగా మారారు హైపర్ ఆది. తనదైన కామెడీతో అందరినీ నవ్వించే హైపర్ ఆది తాజాగా రైతుల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్లకు అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. అంతేకాదు ఆయన చేసిన కామెంట్లు ఆలోచింప చేస్తున్నాయని చెప్పాలి.
విషయంలోకి వెళ్తే .. ప్రస్తుతం ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షో కి సంబంధించిన బ్యాక్ టు బ్యాక్ పంచెస్ కి సంబంధించిన ఒక ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. అందులో డైరెక్టర్ ఎమ్మెస్ రాజు(MS Raju ) తన అగధ చిత్ర బృందం తో వచ్చి సందడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఒక సీరియల్ నటుడు వర్షాల కారణంగా పంట నీటిలో మునిగిపోయి.. చేతికి రాక.. కౌలు దారులకు కౌలు కట్టలేక అప్పుల ఊబిలో మునిగిపోయి చివరికి ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక స్కిట్ చేశారు. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ..” నేను కచ్చితంగా నమ్ముతున్నాను.. ఫ్యూచర్లో సిస్టంతో పని చేసే వాడికంటే ఇలా కష్టంతో పనిచేసే వాడికే ఎక్కువ వ్యాల్యూ ఉంటుందని నేను నమ్ముతున్నాను” అంటూ తెలిపారు.
also read:మనోజ్- మౌనిక పెళ్లి.. మోహన్ బాబు గురించి నిజాలు బయట పెట్టిన అఖిలప్రియ!
ఆది మాట్లాడుతూ..” వ్యవసాయంలోనే సాయం ఉందంటారు.. వాళ్లు కష్టపడి అందరికీ తిండి సహాయం చేస్తున్నారు. కానీ వారికి మాత్రం ఎవరు సహాయం చేయట్లేదు” అంటూ రైతులకు సహాయం చేసే చేతులు ఎక్కడ? అంటూ హైపర్ ఆది కామెంట్లు చేశారు. మొత్తానికైతే రైతుల గురించి, రైతులు పడుతున్న కష్టాల గురించి చేసిన ఈ స్కిట్, ఆది మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే బుల్లితెరపై ఎన్నో చానల్స్ లో ఎన్నో షోలు ప్రసారమవుతున్నాయి. అయితే ఆ షోలలో సెలబ్రిటీలు మాత్రమే వచ్చి సందడి చేస్తున్నారు. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రం ప్రతిభకు వేదికగా నిలుస్తోంది. ఎంతోమంది మారుమూల గ్రామాల నుండి తమలోని టాలెంట్ను నిరూపించుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీ పెద్ద వేదికగా నిలుస్తోంది. జానపద కళలను మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా అంతరించిపోతున్న కళలకు సంబంధించిన విషయాలను కూడా ఈ వేదికపై చూపెడుతూ ఆ కళలకు ప్రాణం పోస్తున్నారు. అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ టాలెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది అనడంలో సందేహం లేదు. ఇకపోతే ఇప్పుడు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త హంగులతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు రష్మీ హోస్ట్ గా వ్యవహరించగా.. ఇప్పుడు ప్రదీప్ మాచిరాజు హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.