Intinti Ramayanam Today Episode April 26th :అవని తన పుట్టింటికి వెళ్ళగానే అక్కడ మీనాక్షి ప్రణతి భరత్ ని ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు అని పదేపదే అడుగుతారు. భరత్ మాత్రం తనకు ఏమీ తెలియనట్లుగా మౌనంగా ఉంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన అవని నా భర్తనే కొడతావా అని భరత్ ని చెంపలు పగలగొడుతుంది. నీకెంత ధైర్యం రా నా భర్త మీద చెయ్యి ఎత్తుతావా అని అవని కొడుతున్నాడని చూసి మీనాక్షి ప్రణతి ఇద్దరు షాక్ అవుతారు. అక్కడికి వచ్చిన చక్రధర్ కూడా భరత్ ని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు. అవని ఎంతగా కోపని కంట్రోల్ చేసుకోవాలనుకున్న కూడా భరత్ మాటలతో ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది. మొత్తానికి పల్లవి రాజేశ్వరిలు అక్క తమ్ముళ్ల మధ్య చిచ్చు పెడతారు.
చక్రధర్ ఆస్తులన్నీ పోయాయి కాబట్టి మీకు డబ్బులు ఇవ్వలేము అని ఫైనాన్షియర్లు ఇంటికి వచ్చి మరి చెప్పగానే అక్షయ్ అవని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆయన షూరిటీగా పెట్టడంతో మీకు డబ్బులు ఇచ్చాము ఇప్పుడు ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము మీకు ఎటువంటి సహాయం చేయలేము ముందుగా మీరు కట్టిన డబ్బుల్ని కూడా మాకు ఇచ్చేయాలి అని అతను వార్నింగ్ ఇస్తాడు. అతను లేకపోతే ఇంకేమి వేరే ఎవరినైనా అడిగి తెలుసుకుందామని అక్షయ్ అనుకుంటూ ఉంటాడు.
చక్రధర్ అవని అక్షయ లకు ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని పిలుస్తాడు. అయితే అక్కడ ఫైనాన్షియర్ మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు ఇవ్వమని చెప్పారు కదా నా దగ్గర ఉన్న 50 లక్షలు ఇవి నా పర్సనల్ అకౌంట్ లో ఉన్నవి తీసుకోండి అని ఇస్తాడు. అధి కాస్త రాజేశ్వరి పల్లవికి తెలియడంతో అవినీకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అనుకుంటారు.. ఇక డబ్బులు తీసుకున్న అక్షయ్ ఎలాగైనా సరే సైట్ కి వెళ్లి అక్కడ పనులను పూర్తి చేయాలి అని అనుకుంటాడు.
తన భర్త తనతో ఎక్కువసేపు ఉండడం లేదని ఇంట్లో గౌరవం దక్కలేదని శ్రేయ చీటికిమాటికి గొడవ వేసుకుంటుంది. తన భర్తని తనతో ఉండాలి అని మాట తీసుకుంటుంది. కానీ శ్రీకర్ మాత్రం తన ఫ్యామిలీ వైఫై మాట్లాడడంతో శ్రేయ బాధ పడిపోతుంది. నా భర్త నా మాట వినడం లేదు అని ఎలాగైనా సరే తనని నా మాట వినేలా చేసుకోవాలి అని అనుకుంటుంది.. ఇక శ్రీకర్ని తన దగ్గరికి రప్పించుకోవాలి అని మాస్టర్ ప్లాన్ చేస్తుంది. తను అనుకున్న విధంగానే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అక్కడికి శ్రీకర్ని కూడా రమ్మని చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లోని వాళ్ళు ఎంతగా బ్రతిమిలాడినా కూడా మీకు అనవసరం ఇది నా లైఫ్ అని అంటుంది..
రాజేశ్వరి తన కొడుకు భరత్ అని తెలుసుకున్న తర్వాత నుంచి తనకి దగ్గర ఎందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.. ఎటువంటి అర్హతలు లేని భరత్ కి తన ఆఫీసులో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇవ్వడంతో పాటుగా ఖరీదున కారు కూడా ఇవ్వడంతో ఒక్కసారిగా గౌరవం పెరిగి కన్నీళ్లు పెట్టుకుంటాడు. చక్రధర్ భరత్ ని మెల్లగా తన వైపు తిప్పుకునేందుకు రాజేశ్వరి ప్రయత్నాలు చేస్తుంది అని అనుకుంటాడు. తనకు దూరంగా ఉండమని ఎంతగా చెబుతున్నా సరే నువ్వు ఎవడు చెప్పడానికి అని భరత్ ఇంకా దగ్గరవుతాడు.
పల్లవి రాజేశ్వరి ఇద్దరు కూడా ఎలాగైనా సరే ఇంట్లోనే వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేయాలి అని అనుకుంటారు. పల్లవి చెప్పిన ప్లాన్ ప్రకారం అక్షయ ఉన్న సైట్ కి వెళ్లి అక్కడ పెద్ద రచ్చ చేస్తుంది. డబ్బులు కట్టేంతవరకు సైట్ లో ఎటువంటి పని చేయకూడదు అని చెప్తుంది. అక్షయ్ రాజేశ్వరిల మధ్య పెద్ద గొడవే జరుగుతుంది. ఆ తర్వాత రాజేశ్వరిని కొట్టబోతుంటే భరత్ వచ్చి అడ్డుకొని భావాన్ని కూడా చూడకుండా చంప పగలగొడతాడు. అటు కమల్ కూడా దెబ్బలు పడతాయి మొత్తానికి అయితే అమ్మ కొడుకులు కలిసిపోయినట్లు తెలుస్తుంది. మరి వచ్చేవారం కూడా వీళ్ళిద్దరూ కలుస్తారో లేదో చూడాలి… ఏది ఏమైనా కూడా మొన్నటి వరకే సాఫ్ట్ గా సాగిపోయిన ఈ సీరియల్ ఇకమీదట రచ్చలకు కేరాఫ్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి..