Ramayana Movies:వెండి తెరపైకి ఇప్పటి వరకు రామాయణం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చి అలరించాయి. అయితే ఏ ముహూర్తాన మా సినిమా బడ్జెట్ ఏకంగా 4000 కోట్లంటూ నిర్మాత నమిత్ మల్హోత్రా అనౌన్స్ చేశాడో కాని అప్పటి నుండి ఈ రణ్ బీర్ కపూర్ రామాయణం ఒక్కసారిగా హైలెట్ అయిపోయింది.ఇక తాజాగా సినిమా నుండి టీజర్ రావడంతో ఇక ఈ సినిమా పై ఎక్కడ లేని డిబేట్లు పెట్టేస్తున్నారు కూడా.అయితే ఇదే క్రమంలో రామాయణం ఆధారంగా కొన్ని సినిమాలు అనుకుని మొదలవకుండానే ఆగిపోగా, మరికొన్ని సినిమాలు మొదలవకుండానే వెనక్కి వెళ్ళిపోయాయి అంటూ కొన్ని సినిమాల గురించిన కొన్ని వార్తలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరింతకీ ఆ సినిమాలేంటో మనమూ చూసేద్దాం!
90s లలో సోహైల్ ఖాన్ రామాయణాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశాడు. ఇందులో సల్మాన్ ఖాన్ శ్రీరాముడిగా, సోనాలి బింద్రే సీతగా నటించాల్సి ఉందట.అంతేకాదండోయ్ . ఈ సినిమా దాదాపు 40 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా. కానీ ఏమైందో ఏమో.. ఆ తర్వాత సినిమా పూర్తిగా ఆగిపోయింది. అసలు ఎందుకు నిలిచిపోయిందో ఇప్పటికీ అధికారికంగా ఎవరూ చెప్పకపోవడమే ఇక్కడ మ్యాజిక్.
ఇక ఆ తర్వాత దర్శకుడు రాజ్కుమార్ సంతోషి కూడా రామాయణం ప్రకటించడంతో బాలీవుడ్లో పెద్ద చర్చ జరిగింది.ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్ రాముడిగా, కాజోల్ సీతగా, రితేష్ దేశ్ముఖ్ లక్ష్మణుడిగా, ప్రకాశ్ రాజ్ రావణుడిగా నటిస్తారని వార్తలు వచ్చాయి.ఇక కాస్టింగ్ చూసి అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు కూడా.మరో విజువల్ వండర్ ఆన్ ది వే అంటూ మురిసిపోయారు.కానీ భారీ బడ్జెట్, హీరోల డేట్స్ సమస్యల వల్ల ఈ సినిమా ప్లానింగ్ స్టేజ్ దాటలేకపోయింది బీ టౌన్ లో వినిపించే టాక్.
ఇక 2008లో సంజయ్ ఖాన్ ది లెజెండ్ ఆఫ్ రామా’ పేరుతో మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు.ఇందులో హృతిక్ రోషన్ రాముడిగా, జాయెద్ ఖాన్ లక్ష్మణుడిగా, అమితాబ్ బచ్చన్ దశరథుడిగా నటించాల్సి ఉంది.ఇక అప్పట్లో దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ కూడా అనుకున్నారట . పైగా మూడేళ్ల పాటు స్క్రిప్ట్పై పని చేశారు కూడా . విదేశీ రచయిత ఫరూఖ్ ధోండీ కూడా ఈ ప్రాజెక్ట్లో భాగమయ్యారు.ఇంకేం సినిమా పక్కా అనుకున్నారు.కానీ ఫైనాన్షియల్ సమస్యలు రావడంతో సినిమా మొదలవకుండానే అటకెక్కింది.
ప్రస్తుతం తెరకెక్కుతున్న రామాయణ కూడా ఒక్క రోజులో మొదలైన ప్రాజెక్ట్ కాదు.దర్శకుడు నితీష్ తివారీ దాదాపు 2015 నుంచే ఈ సినిమాపై వర్క్ మొదలుపెట్టాడట . కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్, రీసెర్చ్.. ఇలా దాదాపు 7 నుంచి 10 ఏళ్లు ఈ ఒక్క ప్రాజెక్ట్కే కేటాయించాడట నితీష్.ఇక మధ్యలో మహేష్ బాబు రాముడిగా నటిస్తారనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే అప్పటి నిర్మాత మధు మంతెన ఆ వార్తలను ఖండించాడు. నటీనటుల ఎంపికపై తుది నిర్ణయం దర్శకుడిదేనని స్పష్టం చేశాడు.తర్వాత మధు మంతెన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ భారీ ప్రాజెక్ట్ను ఇదిగో ఇలా ముందుకు తీసుకొచ్చారు.
also read :రణ్బీర్ కంటే ముందే రాముడిగా సల్మాన్.. కానీ చివరికి జరిగింది ఇదే!
ఇప్పుడు ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందన్న సంగతి తెల్సిందే.రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు.ఇక మొదటి భాగం 2026 నవంబర్ 6న, రెండో భాగం 2027 దీపావళికిరిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.ఇక దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 50 వేల స్క్రీన్లలో విడుదలయ్యే తొలి భారతీయ చిత్రాల్లో ఒకటి కాబోతుందని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.చూడాలి దాదాపు పదేళ్ళు గా కష్ట పడుతున్న నితీష్ తివారి ఆ కష్టాన్ని తెరపైకి ఎలా తీసుకువస్తాడో !