Intinti Ramayanam Today Episode May 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్ర ప్రసాద్ ను అత్తయ్యని మర్చిపోలేక పోతున్నారు అంటూ అవని అడుగుతుంది. అటు పార్వతి కూడా రాజేంద్ర ప్రసాద్ గురించి మాట్లాడడం ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అటు అవని కూడా రాజేంద్రప్రసాద్ కి మీరు అద్దెని క్షమించి అత్తయ్య దగ్గరికి వెళ్ళండి మామయ్య అని చెప్పిన కూడా ఆయన వినడు. ఆ తర్వాత భానుమతి బెడ్ పై కూర్చుని పండ్లు తింటూ ఉంటుంది. కమల్ భానుమతిని చూసి సీరియస్ అవుతాడు. ఇంట్లో ఇన్ని గొడవలు ఉంటే నువ్వు ప్రశాంతంగా పళ్ళు తింటున్నావా.. అసలు నువ్వేం పెద్ద దానివి పెద్దరికం అంటే సమస్యలు చూస్తూ ఉండడం కాదు సమస్యల్ని పరిష్కరించాలి అని సలహా ఇచ్చి వెళ్ళిపోతాడు. భానుమతి మాత్రం ఇంట్లో సమస్యలను ఎలాగైనా పోయేలా చేయాలని అనుకుంటుంది. మళ్లీ కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది. అక్షయ్ ఇవాళ అమ్మని తీసుకొని బయటకు వస్తాడు. రాజేంద్రప్రసాద్ అవని కూడా కనిపించడంతో నలుగురు మాటలు యుద్ధం చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ప్రోమో విషయానికొస్తే.. అక్షయ్ అవని, పార్వతీ రాజేంద్రప్రసాదుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటుంది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని అందరిని ఇలా బయట చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అంటాడు. ఏంటి అందరూ కలిసే వచ్చారు ఏదైనా విశేషమా లేకపోతే ఎక్కడికైనా వెళ్తున్నారా అని అతను అడుగుతాడు. అవునండి మేము అనుకోకుండానే కలుస్తాం కానీ కలిసే వెళ్తున్నాం కలిసే ఉంటున్నామని అవని అంటుంది. అక్షయ్ ఆ వ్యక్తికి సమాధానం చెప్పలేక అవని ఏం చెప్తుందని మౌనంగా ఉండిపోతాడు. ఇక తర్వాత కూరగాయలు తీసుకొని అవని రాజేంద్రప్రసాద్ ఇంటికి వెళ్తారు..
రాజేంద్రప్రసాద్ తన గెటప్ ని పూర్తిగా మార్చుకుంటాడు అది చూస్తున్న ఇంట్లో వాళ్ళందరూ మీరేంటి ఇలా వంట చేయడం ఏంటి అని అడుగుతారు. అవతారం ఏంటి అని స్వరాజ్యం అడుగుతుంది. వంటవాడు అన్నాక ఇలాంటి వేషంలోనే ఉండాలి ఇలానే కదా వంటవాడు చేసేది షూటు బూటు వేసుకొని చేస్తే బాగోదు కదా అని సెటైర్ వేస్తాడు.. మీరందరూ కాసేపు అలా ఉండండి. కొద్ది నిమిషాల్లో బెండకాయ ఫ్రై కూడా చేసుకొని వస్తాను అందరం కలిసి భోజనం చేద్దామని అంటాడు.
రాజేంద్రప్రసాద్ ఒక ఫైల్ మీద సంతకం పెడితేనే ప్రాజెక్ట్ వస్తుందని అక్షయ్ రాజేంద్రప్రసాద్ మా ఇంటి దగ్గరికి వెళ్తాడు. తన తండ్రి ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడంటూ చూసి బాధపడతాడు. అక్షయని చూసిన అవని రాజేంద్రప్రసాద్ అని పిలుస్తుంది.. ఏంటి ఇలా వచ్చావ్ ఏదైనా పని మీద వచ్చావా లేక ఏదైనా అనడానికి వచ్చావా అని రాజేంద్రప్రసాద్ అక్షయని అడుగుతాడు. ఫైల్ మీద మీరు అర్జెంటుగా చేయాల్సిన సంతకం ఒకటుంది మీరు చేస్తేనే ఆ ప్రాజెక్టు మనకు వస్తుంది అని డాక్యుమెంట్స్ ఇస్తాడు. నీకు మీ అమ్మకు బానిసలా కనిపిస్తున్నానా..? నేను సంతకం పెట్టను. ఏదైతే అది అయింది అని రాజేందర్ ప్రసాద్ తెగేసి చెప్పేస్తాడు.
మనుషులు అవసరం లేదు గాని వాళ్ళ సంతకాలు అవసరం డబ్బే, మీ ప్రపంచం అని రాజేంద్రప్రసాద్ అడగని అక్షయ్ మీరు దీని మీద సంతకం చేయకపోతే కంపెనీ చాలా లాస్ అవుతుంది. దాదాపు 150 కోట్లు ఈ ప్రాజెక్టు మీద మనకి వస్తుంది అని వివరిస్తాడు. ఎంత చెప్పినా కూడా రాజేంద్రప్రసాద్ మాత్రం సంతకం పెట్టకుండా ఆ డాక్యుమెంట్స్ ని విస్తరి కొట్టేస్తాడు. అవని ఎంత చెప్పినా కూడా రాజేంద్రప్రసాద్ వినకుండా ఆ డాక్యుమెంట్స్ ని కింద పడేస్తాడు. అవని మాటలు నీకు అంతగా ఎక్కువైపోయాయి నాన్న నువ్వు కొడుకును కాదని ఇక్కడికి వచ్చేసావా ఆ మాత్రం నీకు అర్థం కావట్లేదని అక్షయ్ అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తిఅవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. ఏది ఏమైనా కూడా సోమవారం ఎపిసోడ్ మాత్రం కాస్త ఆసక్తిగానే ఉంటుందని తెలుస్తుంది.