BRS Strategy: ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్తో రాజకీయం చేసి ప్రజలతో మమేకమైన బీఆర్ఎస్.. ఇప్పుడు కొత్త పొలిటికల్ లైన్ ఎంచుకుంది. ప్రభుత్వ నిర్ణయాలతో నష్టపోతున్న, ఇబ్బంది పడుతున్న ప్రజలను కలిసి వారికి భరోసా కల్పించాలని ప్లాన్ చేస్తోంది. అధికార పార్టీ నిర్ణయాలను వ్యతికించి, విమర్శలకే పరిమితం అయితే ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించింది బీఆర్ఎస్. సర్కార్ నిర్ణయాలతో నష్టపోయిన వారిని నేరుగా కలిస్తే, వారి గురించి ప్రస్తావిస్తే ఓటు బ్యాంక్ ను పెంచుకోవచ్చని ఆ పార్టీ ప్లాన్.
22-A భూములు వివాదం, HYDRAA కూల్చివేతలు, రైతు సమస్యలు ఇలా ఇష్యూస్ ని తీసుకొని అందులో బాధితుల గురించి పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. 2023 తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం కావడంతో ఆ పార్టీకి ప్రజలతో కనెక్షన్ కట్ అయిందని ఓ విమర్శ ఉంది. ఈ విమర్శ కంప్లీట్గా నిజం కాకపోయినా.. పూర్తిగా ఖండించలేని పరిస్థితి. ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తో ఆ పార్టీ బాగా రాజకీయం చేసింది. కానీ, ఇప్పుడు అది వర్క్ అవుట్ అయ్యేలా లేదు. అందుకే ప్రభుత్వ బాధితులను కలిసి మళ్లీ పబ్లిక్ తో కనెక్షన్స్ పెంచుకోవాలనే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది.
Also read: పాకిస్తాన్ పతనానికి బాబర్ ఆజం కుట్రలే కారణం…వాడి వల్లే అందరూ దోషులయ్యారు
కొత్త అజెండాతో ముందుకు వస్తున్న బీఆర్ఎస్ కు ఓ ప్రశ్న ఎదురవుతోంది. బాధితుల దగ్గరకు వెళ్తే సరిపోతుందా? లేకపోతే ఆ సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేయాలా అనేది బిగ్ క్వశ్చన్. అలా పరిష్కారమే లక్ష్యంగా ఎన్ని పోరాటాలు చేయగలరు? ఇలా చేస్తూ బాధితుల అసంతృప్తిని BRS అనుకూలంగా మార్చుకోగలదా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
Also read: మార్కెట్లో సంచులు మోసేవాన్ని – ఈశ్వర్ సాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే