E-Paper
Advertisement

ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ తో రిలేషన్ ఎప్పటినుండో తెలుసా ?

ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్ తో రిలేషన్ ఎప్పటినుండో తెలుసా ?
Advertisement

Eshwar Sai: మాధురి రాథోడ్ తో వేములవాడ రెడ్డి భవన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఈశ్వర్ సాయి గత మూడు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న సంగతి తెల్సిందే.అయితే ఎట్టకేలకి అజ్ఞాతం నుండి బయటకి వచ్చిన ఈశ్వర్ సాయి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన సంఘటనలు పంచుకున్నాడు.ఈ క్రమంలో తనకి మాధురి రాథోడ్ తో ఎలా పరిచయం ఏర్పడిందో ఎప్పటి నుండి తమ రిలేషన్ నడుపుతున్నారో ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు ఈశ్వర్ సాయి .

చేసిన తప్పు పట్ల సారీ

ఈశ్వర్ సాయి మాట్లాడుతూ ఆంద్రా నుండి వచ్చి జూనియర్ ఆర్టిస్ట్ గా చేసిన తనకి ఫోక్ ఇండస్ట్రీ అన్నం పెట్టి ఆదుకుందని, మాధురి రాథోడ్ తో జరిగిన సంఘటనకి ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని, దయచేసి జానపదాలని అవమానించవద్దని వేడుకున్నాడు.ఇక ఈ ఫోక్ ఇండస్ట్రీలో తను ఒక ముగ్గురికి క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నానని వాళ్ళు శేఖర్ వైరస్, జలందర్, ఉదయ్ అని వారికి తానూ చేసిన తప్పు పట్ల సారీ చెబుతున్నాని తెలిపాడు.

గత రెండు నెలలుగా

Advertisement

ఇక ఈ క్రమంలో మాధురి రాథోడ్‌ తో తనకున్న సంబంధం పై నోరు విప్పాడు ఈశ్వర్ సాయి.తమకి ఇదారేళ్ళుగా పరిచయం ఉందని. అప్పుడు ఈశ్వర్ గారు అని తను, మాధురి గారు అని నేను పిలుచుకునే వాళ్ళమని చెప్పుకొచ్చాడు.అప్పుడు కేవలం తమ మధ్య ఫ్రెండ్ షిప్ మాత్రమే ఉందని, కానీ గత రెండు నెలలుగా మనశ్శాంతి కరువు అవడంతో, ఇంటా బయటా, బిజినెస్ లో ఇలా అన్ని రకాలుగా మెంటల్ ప్రెజర్ ఫేస్ చేయడంతో ,మానసికంగా కుంగిపోయానని తెలిపాడు.

also read :ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?

ఓదార్చిన మాధురి రాథోడ్ 

Advertisement

అలా ఆ సమస్య నుండి బయటపడేందుకు తనని ఎమోషనల్ గా ఓదార్చేందుకు ఒక షోల్డర్ అవసరమైనదని, ఆ షోల్డర్ మాధురి రాథోడ్ ది అయిందని అసలు విషయం చెప్పుకొచ్చాడు.అలా కేవలం గత రెండున్నర నెలలుగానే ఈ ఈ రిలేషన్ లోకి అడుగుపెట్టామని, అంతకు ముందు ,మా మధ్య ఇలాంటిది ఏమీ లేదని తెలిపాడు.

ఆ పని చేయాల్సింది కాదు 

ఇక వీడియో నెట్టింట్లో వైరల్ అవడం గురించి మాట్లాడుతూ అసలు తన భార్య శరణ్య ఆ పని చేయాల్సింది కాదని, ఇపుడు తను చేసిన పనికి అటు మాధురి రాథోడ్, ఇటు నేను ,అటు శరణ్య ఇలా ముగ్గురం ఇబ్బంది పడాల్సివస్తుందని వాపోయాడు.ఇక తాను చేసింది తప్పే అని,అయితే బుక్ లో ఒక లైన్ లేదా ఒక పేజీ తప్పు అయినంత మాత్రానా మొత్తం ఆ బుక్ నే నెగెటివ్ గా చూళ్ళేమని అలాగే ఈ ఒక్క తప్పు వల్ల నా క్యారక్టర్ ని మొత్తం తప్పు అంటేనే బాధేస్తుంది అంటూ తెగ బాధ పడిపోయాడు.

అక్కడ ఎందుకు ఉన్నానంటే 

ఇక రెడ్డి భవన్ లో ఆరోజు ఉండటానికి గల కారణం గురించి చెబుతూ అంతకు ముందు కంటిన్యూ గా షూటింగ్ లలో ఉన్నానని,అయితే ఆరోజు కూడా ఉండాల్సిన షూటింగ్ అనుకోకుండా క్యాన్సిల్ అయిందని అలా తామిద్దరం అక్కడ ఉండాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.

also read :మాధురి రాథోడ్ చేసిన పాపులర్ ఫోక్ సాంగ్స్ ఇవే !

ఇక చివరగా ఇల్లీగల్ రిలేషన్స్ చాలా డేంజర్ అని, దొరికితే సొసైటీలో మొహాలు ఎవరికీ చూపించుకోలేమని కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని హిత బోద చేశాడు !

Tags

Related News

బహిరంగంగా తప్పు ఒప్పుకున్న ఈశ్వర్ సాయి.!

మాధురి రాథోడ్ చేసిన పాపులర్ ఫోక్ సాంగ్స్ ఇవే !

భర్త చనిపోతే అన్నీ తీసేయాలా.. అనసూయ హాట్ కామెంట్స్ వైరల్!

బిగ్ బాస్ 10లోకి శర్వానంద్ హీరోయిన్ సీరత్ కపూర్.. ఒక్క పోస్టుతో క్లారిటీ!

Gundeninda GudiGantalu Today episode: మళ్లీ మోసపోయిన మనోజ్.. ప్రభాకు అబద్దం చెప్పిన మనోజ్.. బాలు కౌంటర్స్..

Podarillu Today Episode : కేశవకు హగ్ ఇచ్చిన శైలు.. మాధవ్ క్షమాపణ.. శైలుకు వరాలు వార్నింగ్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ గొడవ.. పాపం నర్మద.. చందుకు అనుమానం..

Big Stories

Advertisement
×