Podarillu Today Episode April 22nd : మహాలక్ష్మి చక్రి కోసం దోమల ఆయింట్మెంట్ ని తెచ్చి ఇస్తుంది. వీళ్ళిద్దరి కన్వర్జేషన్ కాస్త ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది.. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటారు అయితే మీరు ఎందుకు పెద్దికి నిజం చెప్పలేదు అని అడుగుతుంది. ఆ మాట చెప్పగానే అన్నయ్య మన అందరిని కొట్టేసి అక్కడికి వెళ్ళిపోతాడు. మనం నిజం చెప్పకుండా పెళ్లి చేసి ఆ తర్వాత నిజం చెప్పడం మేలు అని చక్రి అంటాడు. అందరూ మీ అంత గంప గయాలి లాగా ఉండరు కదా అని చక్రీ మహాను కన్విన్స్ చేస్తాడు. మాధవ్ మాత్రం పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో నేను లేను అని అంటాడు. మహాలక్ష్మి దానికి షాక్ అవుతుంది…
మాధవ్ పెళ్లి చేసుకున్న తర్వాత వేరే కాపురం పెట్టాల్సి వస్తుంది అని ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పకుండానే పెళ్లి నీ చెయ్యాలి అని అనుకుంటారు. కానీ మాధవ్ వెళ్ళిపోతాడని కన్నా చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఏమైంది వీడికి అని మాధవి ఎన్నిసార్లు అడిగినా కూడా మాట్లాడరు. నువ్వు బిస్కెట్లు అడిగావు కదరా తీసుకోరాని ఎంతగా చెప్పినా సరే కన్నా మాత్రం మౌనంగా ఉండడంతో కేశవా సీరియస్ అవుతాడు. అరే అన్నయ్య నీకోసం ఇష్టంగా తెచ్చాడు కదా ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని కేశవ అనగానే వాడిని తిట్టదురా అని మాధవ్ అంటాడు. మొత్తానికి కన్నా బాధపడుతున్న విషయాన్ని మాధవ్ కి తెలియకుండా జాగ్రత్త పడతారు..
మాధవ్ కి కవిత ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మహాలక్ష్మికి ఆవిడ ఫోన్ చేస్తుంది. మాధవ్ గారికి ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయడం లేదు అందుకే మీకు ఫోన్ చేస్తాను ఆయనతో మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇస్తారా అని కవిత అంటుంది. వాడి సంగతి నేను చూసుకుంటాను పెద్ది. నువ్వు ఒకసారి కవితతో మాట్లాడు అని మహాలక్ష్మి అంటుంది. మాధవ్ ఇక ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు. రే కన్నా నువ్వు ఇలా ఉంటే మనం కచ్చితంగా దొరికిపోతామని మహాలక్ష్మి అంటుంది. మరి కవిత అన్నయ్యకి అసలు నిజం చెప్తుందేమో వెళ్లి చూద్దాం పదండి అని అందరూ వెళ్తారు. అక్కడ మాధవ సంతోషంగా మాట్లాడటంతో నిజమైనవి చెప్పలేదు అని అందరూ అనుకుంటారు.
చక్రి క్యాబ్ డ్రైవర్ గా వెళ్తాడు. అయితే అక్కడ ఒక యూనివర్సిటీలోని మేడం నీ పిక్ చేసుకుంటాడు. ఇన్ని రోజులు నువ్వు వచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు రాకపోవడంతో ఏదోలా ఉంది అని అనుకున్నాము ఎక్కడికి వెళ్లావు ఎన్ని రోజులని ఆవిడ అడుగుతుంది. చక్రి పెళ్లి చేసుకోవడానికి వెళ్లాను అని అనగానే.. మీ పెళ్లి గురించి షార్ట్ గా చెప్పండి అని ఆవిడ అడక్కగానే చక్రి అని విషయాలు చెప్తాడు. మీరు మాకు ఒక సహాయం చేయాలి అని చక్రి తనని అడుగుతాడు. మామిడి సర్టిఫికెట్ల కోసం మీరు నాకు హెల్ప్ చేయాలని చెక్రి అడగగానే ఆవిడ చేస్తానని చెప్తుంది. మహాలక్ష్మి గోల్ రీచ్ అవుతుందని చక్రి చాలా సంతోషంగా ఉంటాడు.
కన్నా వచ్చిన వదిన నన్ను మీలాగే ప్రేమగా చూసుకుంటుందా అని మహాలక్ష్మిని అడుగుతుంది. నాకన్నా ఎక్కువ బాగా చూసుకుంటుంది ఆవిడ కొత్తగా వచ్చింది కదా.. అందుకే అలా ఆలోచిస్తుంది అర్థం చేసుకుంటే మిమ్మల్ని వదిలి ఎక్కడికి పోదు అని మహాలక్ష్మి అంటుంది. ఇక నారాయణ స్వీట్స్ కోసం వెళ్లి అన్నీ తీసుకొని వస్తాడు. అప్పుడే పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారని చెప్పగానే అందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇంటికి వచ్చిన మాధవ్ నీ వెంటనే రెడీ చేసి తీసుకొని వస్తారు. పెళ్లి వాళ్ళు ఇంట్లోకి రాగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అయితే పెళ్లికూతురు వాళ్ళు పెట్టిన కండిషన్ గురించి బ్రోకర్ చెప్తూ ఉండగా చక్రి ఆపుతాడు.. ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేసి ముహూర్తం పెట్టమని చెప్తాడు..
ముహూర్తం వచ్చే నెల పెట్టగానే అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అందరూ ఇక వెళ్ళిపోగానే మాధవ్ కన్నా చాలా సంతోషంగా ఉన్నాడు నాకు అదే చాలు అని అంటాడు. వాడికి వదిన స్థానంలో అమ్మ వస్తుంది కదా అందుకే చాలా సంతోషంగా ఉంటాడు అని మాధవ్ అంటాడు. ఇక మహాలక్ష్మి కన్నా నీ ఎమోషనల్ అవ్వకుండా చూసుకుంటుంది. పెళ్లి పనులను అన్నిటిని నేనే దగ్గరను చూసుకుంటానని చక్రి మాట ఇస్తాడు.. కేశవ చక్రి ఇద్దరు కూడా మరోసారి గొడవపడతారు అది చూసిన మహాలక్ష్మి సీరియస్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…