Illu Illaalu Pillalu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. అందులో ఈమధ్య ఎక్కువగా కొన్ని సీరియల్స్ కి మంచి క్రేజ్ కూడా లభిస్తుంది. స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే సీరియల్స్లలో కుటుంబ కథ స్టోరీ తో వచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ నటనతో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నారు. అనాధగా పుట్టిన ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఎలా పెంచుకుంటాడు అన్నది ఈ సీరియల్ స్టోరీ.. అయితే ఇప్పుడు ఈ సీరియల్ లో కాస్త బోరింగ్ సీన్లు ఎక్కువ అవ్వడంతో ఎండు కార్డు వేయమని కొందరు డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సీరియల్ లో కొన్ని ల్యాగులు పడడంతో తొందరగా పూర్తి చేసి మరో పార్ట్ ని తీయడం బెటర్ అంటూ కామెంట్లు పెడుతున్నట్లు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అతి త్వరలోనే ఈ సీరియల్ కు శుభం కార్డు పడిపోతుంది అంటూ ఒక వార్త షికారు చేస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో గత కొన్ని రోజుల క్రితం ట్విస్ట్ మీద ట్విస్ట్ లు ఎదురవ్వడంతో జనాలు దీన్ని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ స్టోరీ కాస్త బోర్ కొడుతుంది అని జనాల్లో వినిపిస్తుంది. అందుకే ఎండ్ కార్డు పడబోతుంది అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఈ సీరియల్ ని సాగదీయకుండా రెండు కుటుంబాలు కలిసిపోయేలా చేస్తే ఆ తర్వాత స్టొరీ బాగుంటుంది అని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. నెటిజన్ల కోరిక మేరకు సీరియల్ కి శుభం కార్డు వేసి కొత్త సీరియల్ ని ప్రారంభిస్తారా? లేదంటే ఈ సీరియల్ లో ఇంకేదైనా స్టోరీని యాడ్ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఇల్లు ఇల్లాలు పిల్లలు టీం ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి..
ప్రేమ గురించి ధీరజ్ నిజం చెప్పడంతో తను తన గురించి నిజం చెప్పాడు అని బాధపడిపోతూ ఉంటుంది. తన గురించి ఎవరికీ తెలియని విషయాన్ని అందరితో చెప్పాడు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. ధీరజ్ ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా కూడా ప్రేమ మాత్రం తన పరువు తీశాడని అని ధీరజ్ తో మాట్లాడటానికి కూడా ఇష్టపడదు… అటు శ్రీవల్లి ప్రేమ కాపురాని ఎలాగైతే విడగొట్టానో నర్మద కాపురాని కూడా అలానే విడగొట్టాలి అని ప్లాన్ వేస్తుంది కానీ.. ప్రేమని విడాకులు తీసుకోమని చెప్తే ప్రేమ చంప వాయించేస్తుంది. నా భర్త నేను ఎప్పటికైనా ఒక్కటి అవుతాము నీ కాపురా నేను కడుక్కో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంది. ప్రేమ వార్నింగ్ ఇచ్చింది అని ఎలాగైనా సరే తన భర్తతో తనని దూరం చేయాలి అని మరో ప్లాన్ చేస్తుంది. భద్రతో ఫోన్ మాట్లాడుతూ శ్రీవల్లి అడ్డంగా దొరికిపోతుంది. అటు సాగర్ లంచం తీసుకొని వచ్చి ఇంట్లో పెడతాడు ఆ డబ్బులు ఎక్కడివి అని నర్మదా అడుగుతుంది మేనేజ్ చేస్తాడు. సోమవారం ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి..