Ye Devi Varamo Neevu Manish: ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ‘ఏ దేవి వరమో నీవు ‘ సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇటీవలే ప్రారంభమైన ఈ సీరియల్ కేవలం కొన్ని రోజులలోనే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఇందులో హీరో పాత్రలో మనీష్ నటిస్తున్నాడు. ఈ మనిషి గురించి గతంలో అనేకసార్లు మనం చెప్పుకునే ఉంటాము. అయితే ఈ హీరో గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త ప్రచారంలో ఉంది. ఇటీవల ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చినా ఈ హీరో తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత దీన స్థితి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. మరి ఆలస్యం ఎందుకు? ఆయన గురించి మనం కూడా కాస్త వివరంగా తెలుసుకుందాం..
శ్రవణ్ కుమార్ అనంతపురం లోని నిదానవాడ విలేజ్ లో జన్మించాడు.. తర్వాత చదువుని పూర్తిచేసుకుని పిన్ని బాబాయ్ ల సహకారంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని అనుకున్నాడు.. అలా మొదట ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత సీరియల్స్లలో నటించే అవకాశాన్ని అందుకుంటూ వచ్చాడు. 2019 నుంచి ఒక చిన్న విరామం తీసుకుని తిరిగి సీరియల్స్ లో నటుడిగా స్థానం సంపాదించాడు.. ఎన్నో నెలలు నుంచి ఇప్పటివరకు ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. ఒక్కో సీరియల్ లో నటిస్తూ ఎంతో అందంగా నవ్వుతూ కనిపించే శ్రావణ్త న కుటుంబ పరిస్థితిని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుని స్థితికి వచ్చాము అంటే కారణం టాలెంట్ అంటూ ఇంటర్వ్యూ చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారాయి.. ఏది ఏమైనా కూడా ఈ సీరియల్ హీరో శ్రావణ్ కుమార్ ని తలుచుకుని చాలామంది ఎమోషనల్ అవుతున్నారు.. ప్రస్తుతం తెలుగులో పరిశీలనలో నటిస్తూ బిజీగా ఉన్నారు..
తెలుగు సీరియల్స్ లలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శ్రావణ్ కుమార్.. అత్తారింటికి దారేది, కస్తూరి, పల్లకిలో పెళ్లికూతురు వంటి తెలుగు సీరియల్స్ లో నటించాడు. తెలుగు అబ్బాయి అయ్యుండి మలయాళం లో కూడా సుధామణి సుపెరా అనే ప్రాజెక్టులో నటించాడు.. జెమినీ టీవీలో అమ్మకు ప్రేమతో లో వంటి సీరియల్స్ లలో నటించారు. ప్రస్తుతం ఏ దేవి వరమో సీరియల్లో నటిస్తున్నాడు. ఈ సీరియల్ ప్రస్తుతం రోజు రోజు క్రేజీగా మారుతుంది. ఈ సీరియల్ కు గాను దాదాపుగా 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్.. ఈ లెక్కన ఈయన నెలకు లక్షల్లోనె సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఇతను రెండు చేతులా సంపాదిస్తున్నాడు.. సీరియల్స్ తో పాటుగా ఈ మధ్య టీవీ షోలలో ఎక్కువగా సందడి చేస్తున్నాడు.
Also Read : ‘గోదావరి’ సూర్య ఏం చదివాడో తెలుసా..?