Congo Copper Mine Bridge: ఆఫ్రికా కాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలి 32 మంది మృతి చెందారు. లువాలాబా ప్రామిన్స్లోకి కలాండో సైట్లో ఈ ప్రమాదం జరిగింది. కాంగోల్లోని చాలా మందింకి ఈ రాగి మైనింగ్ జీవనాధారం.. దీనిలో 15 నుంచి 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. మైనింగ్ వద్ద కార్మికులు పనిచేస్తున్న సమయంలో… మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో కార్మికులు భయాందోళన చెంది ఇకుకైన వంతెనపై పరుగులు తీశారు. దీంతో అది కుప్ప కూలినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది. బ్రిడ్జ్ కూలిపోయిన దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురుపొడిచేలా ఉన్నాయి.