Sister Nivedita School: హైదరాబాద్ అమీర్పేట్లో విషాదం చోటుచేసుకుంది. సిస్టర్ నివేదిత స్కూల్ నిర్వహించిన ట్రిప్లో నిర్లక్ష్యం కారణంగా ఎనిమిదో తరగతి విద్యార్థి మృతిచెందాడు. స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వండర్లాకు తీసుకెళ్లి, వయస్సుకు మించిన యాక్టివిటీస్ గేమ్స్ చేయించారు. ఆ ఆటల్లో పాల్గొంటూ సూర్యతేజ ఒక్కసారిగా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఇది గమనించిన స్కూల్ యాజమాన్యం వెంటనే విద్యార్ధిని ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సమాచారం విద్యార్ధి కుటుంబానికి తెలపగా.. కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుమారుడి మరణానికి స్కూల్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించిన తల్లిదండ్రులు, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు విచారణ చేపట్టారు.