Jogulamba Gadwal: జోగులాంబ గద్వాలలో కత్తిపోట్లు కలకలం రేపాయి. పట్టణంలోని కృష్ణవేణి చౌక్ వద్ద వంశీ ఫోటో స్టూడియో సమీపంలో స్నేహితుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో వంశీ, అరవింద్, వసంత్ల మధ్య మాటా మాట పెరిగి ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.