Karimnagar RTC Bus: రాజన్న సిరిసిల్ల జిల్లా, వల్లంపట్లలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్ డ్రైవర్ బాలరాజును చితకబాదాడు కారు డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో తండ్రి వయసున్న బస్సు డ్రైవర్ పై దాడికి పాల్పడ్డాడు కారు డ్రైవర్. డ్రైవర్ ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. కారు సిద్దిపేట జిల్లా, గంగాపురం గ్రామానికి చెందిన శ్రీ కాంత్ అనే వ్యక్తిదిగా గుర్తించారు. విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై దాడిని ఖండించారు. సమాచారం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.