Sangareddy: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ అనుకూలించలేదని లవర్తో నామినేషన్ వేయించాడు ఓ యువకుడు. అనంతరం పెళ్లి చేసుకొని సంగారెడ్డి రూరల్ పీఎస్లో ప్రత్యక్షమైంది ఈ జంట. తాళ్లపల్లి గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో నిరాశ చెందాడు యువకుడు చంద్రశేఖర్ గౌడ్. అదే సమయంలో మరో ఆలోచన చేశాడు. తన ప్రేయసి బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. పైగా ఎస్సీ కావడంతో వెంటనే ఆమెతో నామినేషన్ వేయించాడు. వీరికి అండగా నిలిచారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. మరోవైపు.. తమ కూతురు కన్పించడం లేదని పీఎస్లో ఫిర్యాదు చేశారు తల్లితండ్రులు. ఇదే సమయంలో యువతితో నామినేషన్ విత్ డ్రా చేయించేందుకు మరో అభ్యర్థి కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.