Nara Bhuvaneshwari : ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో పర్యాటిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి హాని ఉందన్నారు. ఇప్పటికీ తమ ఫ్యామిలీని బెదిరిస్తున్నారంటూ చెబుతున్నారు. అయితే ఎన్ని బెదిరింపులు వచ్చినా ప్రజల కోసమే పని చేస్తున్నామన్నారు నారా భువనేశ్వరి. గత పాలన గురించి మాట్లాడను అని చెప్పారు. అయితే అది మర్చిపోలేని అంశమన్నారు. ఈ సమయంలో తన కుటుంబానికి ముప్పు ఉందని నారా భువనేశ్వరి ఎందుకు చెబుతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.