Nellore: నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని ప్రణీత (14) ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాన్కు వేలాడుతున్న బాలికను గమనించిన సిబ్బంది ప్రిన్సిపాల్కు తెలపగా.. బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ కూతురు మరణ వార్తతో విద్యాలయానికి చేరుకున్నారు. విద్యార్ధిని విగత జీవిగా పడి వున్న తమ కూతురిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ప్రిన్సిపాల్ వ్యవహారి శైలి కారణంగానే ప్రణీత ఉరివేసుకొని మరణించినట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థి సంఘాలు స్కూల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.