Nizamabad Lady Robbery: నిజామాబాద్లో స్నేహితురాలిగా నమ్మించి భారీ దొంగతనం చేసింది కిలాడీ లేడీ. కుమార్ గల్లీలోని విషన్ ఇంటి సెల్లార్లో ఉన్న బ్యూటీ పార్లర్లో పని చేస్తున్న గాయిత్రి అలియాస్ గౌతమి.. ఇంటి వారితో సన్నిహితంగా మెలిగి, అవకాశాన్ని చూసి ఇంటి తాళానికి డూప్లికేట్ తయారు చేసింది. విషన్ ఇంట్లో పలు మార్లు డబ్బులు కనిపించకపోవడంతో ఇంటి యజమాని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల ఇంట్లో ఎవరు లేని సమయాన్ని గమనించిన గాయత్రి, డూప్లికేట్ తాళం సహాయంతో లోపలికి వెళ్లి 18 తులాల బంగారం, 1,250 గ్రాముల వెండి, ఇంకా కొంత నగదు చోరీ చేసింది. ఈ మొత్తం దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అయ్యాయి. దీంతో బాధితుడు ఫిర్యాదు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీ రికార్డును పరిశీలించి కేసు నమోదు చేసి గాయిత్రిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి శైలిలో విచారణ చేపట్టగా ఆమె నేరాన్ని ఒప్పుకుంది.