Panchayat Elections: పంచాయతీ ఎన్నిక.. ఓ కుటుంబం మధ్య చిచ్చురేపింది. మెదక్ జిల్లా శంషారెడ్డిపల్లిలో ఘటన వెలుగులోకి వచ్చింది. శంషారెడ్డిపల్లి గ్రామం ఎస్టీ రిజర్వ్ కావడంతో, తొలుత తండ్రి గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే అనూహ్యంగా చివరి క్షణంలో నామినేషన్ వేయడానికి గణేష్ కొడుకు వినోద్ సిద్ధమయ్యాడు. అయితే నామినేషన్ వేయకుండా ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్తులు చెప్పారు. సర్దిచెబుతున్నా వినకుండా MPDO ఆఫీసుకు చేరుకున్నాడు వినోద్. అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట.. ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేదనతో వినోద్ నామినేషన్ పత్రాలు చింపేసి వెళ్లిపోయాడు. అయితే అక్కడున్న పోలీసులు మాత్రం నామినేషన్ వేయడానికి వచ్చిన వినోద్ను అడ్డుకున్నా చర్యలు తీసుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారు.