Makkah Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుండి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సు బదర్ మదీనా ప్రాంతంలో డీజీల్ ట్యాంకర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే 42 మంది మృతి చెందారు. మరణించిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారని తెలుస్తోంది. కొన్ని కుటుంబాల్లో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.