Smriti Mandhana: క్రికెటర్ స్మృతి మందాన తన వివాహాన్ని రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇటీవలే స్మృతి, పలాష్ ముచ్చల్తో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం నవంబర్ 23న జరగనుండగా, అకస్మాత్తుగా స్మృతి తండ్రి హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో పెళ్లి ఆగిపోయింది. అయితే ఇప్పుడు పెళ్లి రద్దయిన వార్త హాట్టాపిక్గా మారింది.
స్మృతి మందాన తన ఇన్స్టా స్టోరీలో.. ఆమె జీవితంపై వదంతులు వస్తున్నాయని, ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇటీవలే చివరి నిమిషంలో ఆగిన పెళ్లి, తన తండ్రి ఆరోగ్యం కారణంగా ఆగినట్లు, అలాగే పలాష్తో సంబంధంలో కొన్ని సమస్యలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుందని ఆమె తెలిపింది. ఈ పరిస్థితులే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని స్పష్టం చేశారు. అందువల్ల, నవంబర్ 23న జరగాల్సిన స్మృతి-పలాష్ వివాహం క్యాన్సిల్ అయ్యిందని ఆమె అధికారికంగా ప్రకటించారు.