Suryapet: మద్యం మత్తులో ఉన్న ఓ తండ్రి.. అభం శుభం తెలియని తన కన్న బిడ్డను నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కొత్తపల్లి లో చోటుచేసుకుంది.కొత్తపల్లికి చెందిన వెంకటేష్తో నాగమణికి వివాహం జరిగింది. కొంతకాలం వాళ్ల సంసారం బాగానే సాగింది.వాళ్లకి భవిజ్ఙ(11నెలల) కుమార్తె ఉంది. వెంకటేష్ ఓ రోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో భవిజ్ఞ భయంతో ఏడ్వడం మెుదలుపెట్టింది. చుట్టు ప్రక్కలవారు వింటారని వెంకటేష్ భవిజ్ఙ నోరు మూశాడు.చిన్నపిల్ల ఊపిరి ఆడదు అంటూ తల్లి తన బిడ్డను విడిపించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో నాగమణిని పక్కకు తోసి ఆ చిన్న పిల్ల కాలు పట్టుకొని తలను నేలకేసి కొట్టాడు. వెంటనే పాపను ఆస్పత్రికి తరలించినా ప్రాణం నిలవలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.