Tadepalli: గుంటూరు జిల్లా తాడేపటల్లిలో విషాదం చోటుచేసుకుంది. తాడేపల్లిలోని కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న సురేష్ రెడ్డి అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాపట్ల జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి మృతికి యూనివర్సిటీ సిబ్బంది వేధింపులే కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే యూనివర్సిటీ యాజమాన్యం మృతదేహాన్ని మణిపాల్ ఆసుపత్రికి తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మణిపాల్ ఆసుపత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు తాడేపల్లి పోలీసులు. యూనివర్సిటీ వద్దకు విద్యార్థి సంఘాలు చేరుకుని ఆందోళన చేపడుతున్నారు.