Maharashtra: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో జాతీయ రహదారిపై పెద్ద పులి హల్చల్ చేసింది. దీంతో గంటల తరబడి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. మెుహర్లీ వెళ్లే ప్రధాన రహదారిపై ఓ పెద్ద పులి రోడ్డుమీదకు రావడంతో వాహనదారులు భయంతో షాక్కు గురై తమ వాహనాలను నిలిపివేశారు. పులి అక్కడే తిష్ట వేసి ఉండటంతో ఎవరూ ముందుకు కదల లేకపోయారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చంద్రాపూర్ జిల్లా దట్టమైన అడవీ ప్రాంతం కావడంతో.. ఇక్కడ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అనేక క్రూర మృగాలు రహదారులపై తిరుగుతుంటాయని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాన్ని తడోబా టైగర్ రిజర్వ్ బఫర్ జోన్గా అటవీ అధికారులు తెలిపారు. ఇక్కడి రోడ్లపై ప్రయాణించే వారు హారన్లు మోగించకుండా నిశ్శబ్దంగా వెళ్లాలని.. గతంలో కూడా ఈ మార్గంలో మృగాల దాడుల ఘటనలు చోటుచేసుకున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పులి రహదారి దాటుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.