E-Paper
Advertisement

Vijayawada: అనుమానంతో నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి..

Vijayawada: అనుమానంతో నడిరోడ్డుపై భార్యను కత్తితో పొడిచి..
Advertisement

 Vijayawada:  విజయవాడ సూర్యారావు పేటలో ఓ కిరాతక భర్త బరితెగించాడు. నడిరోడ్డుపై భార్యను అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశాడు. విజయవాడ విన్స్ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తున్న సరస్వతిని 2022 ఫిబ్రవరి 14వ తేదీన విజయ్ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. వారికి ఒక బాబు. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో విజయ్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే సరస్వతిపై అనుమానం పెంచుకున్న హంతకుడు విజయ్..తరచూ భార్యతో గొడవపడేవాడు. భర్త అనుమానంతో విసిగిపోయిన సరస్వతి కొన్నాళ్లుగా భర్తకు దూరంగా బాబుతో ఉంటోంది. ఈ క్రమంలో సరస్వతిపై కోపం పెంచుకున్న కిరాతకుడు విజయ్…ఇవాళ మధ్యాహ్నం సూర్యారావుపేటలో అందరూ చూస్తుండగా…కత్తితో పొడిచి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కి తరలించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×