Shocking Murder: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సాయిపూర్కు చెందిన దంపతులు పరమేశ్, అనూష. గత కొంతకాలంగా ప్రేమించుకున్న తర్వాత వీళ్లిద్దరూ 9 నెలల కిందట పెళ్లి చేసుకున్నారు. కానీ.. ఆ తర్వాతే అనూషకు తన భర్త నిజస్వరూపం కన్పించడం ప్రారంభమైంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న పరమేష్.. కొన్ని రోజుల తర్వాత నుంచి అనూషను కట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. పరమేష్ పెట్టే టార్చర్తో గొంతు కలిపారు అతడి తల్లీతండ్రి లాలమ్మ, మొగులప్ప. పరమేష్తోపాటు వీళ్లు కూడా అనూషను వేధించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే కొన్నిసార్లు పరమేష్.. అనూషను కొట్టేవాడని స్థానికులు సైతం చెబుతున్నారు.
తాాజాగా ఈ దారుణ ఘటనకు సంబంధించిన ఓ వీడియో బయటపడింది. ఈ వీడియోలో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలు చూస్తే ఆ కిరాతకుడు ఎంత దారుణంగా తన భార్యను కొట్టి చంపింది ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. చేతికి అందిన పెద్ద కర్రను తీసుకొని అతడు తన భార్యను కొట్టిన తీరు చూసిన వాళ్లను కంట తడిపెట్టిస్తోంది.