E-Paper
Advertisement

Viral Video: నిన్న పాపడ్.. నేడు బాయిల్డ్ ఎగ్.. ఇదెక్కడి ఎండరా మావా..

Viral Video: నిన్న పాపడ్.. నేడు బాయిల్డ్ ఎగ్.. ఇదెక్కడి ఎండరా మావా..

Viral Video: ఈ ఏడాది వేసవికాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఎక్కడ చూసినా 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మే నెలలో ఉత్తర భారతదేశంలో ఎండలు మరింత విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాజస్థాన్ సరిహద్దుల్లో వేడి గాలులు, మండుతున్న ఎండల కారణంగా అటు జవాన్లు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బికనీర్‌లోని సరిహద్దుకు సమీపంలోని ఓ ఎడారి ప్రాంతంలో ఓ జవాన్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

ఇటీవల ఓ జవాన్ ఇసుక ఎడారిలో ఓ పాపడ్‌ను కాల్చిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే మరో జవాన్ కోడిగుడ్డు ఉడకబెట్టిన వీడియో వైరల్ అవుతోంది. బీఎస్ఎఫ్ జవాన్ రెండు నిమిషాల, 59 సెకన్లలో ఓ కోడిగుడ్డును ఇసుకలో పాతిపెట్టాడు. అనంతరం దానిని తీసి చూడగా అది ఉడికిపోయింది. దీంతో దాని పొట్టును తీస్తూ వీడియో చేశాడు.

రాజస్థాన్ ఎడారులలో తీవ్రమైన వేడి మధ్య సైనికులు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి అధికారులు అనుసరిస్తున్న జాగ్రత్తల వివరాలను వివరిస్తూ BSF సిబ్బంది, ‘ప్రస్తుత ఉష్ణోగ్రత 46 నుండి 47 డిగ్రీల సెల్సియస్, అయినప్పటికీ మా సైనికులు నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నారు. మేము హీట్‌స్ట్రోక్ నుండి రక్షించడానికి వారికి నిమ్మకాయ నీరు, ఇతర ద్రవాలను తీసుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని బార్మర్‌లో ప్రస్తుతం 48.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది.

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×