Viral News: సాధారణంగా అత్త-కోడళ్లకు నిమిషం కూడా పడదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఏదోక విషయం మీద కస్సు బుస్సు అనుకుంటూనే ఉంటారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఓ అత్త మాత్రం తన కోడలిపై ఉన్న అపార ప్రేమను చాటుకున్నారు. బెంగళూరులో ఉన్న కోడలి కోసం బిహార్ నుంచి సూట్ కేసులో పెద్ద ఎత్తున మామిడి పండ్లను పంపారు. ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇన్ స్టాగ్రామ్ యూజర్ శ్రేయా.. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ‘అత్తగారితో మాల్దా మామిడి అంటే ఇష్టం అని మాముల్గా అన్నాను’ అనే క్యాప్షన్ తో ఈ వీడియో ను శ్రేయా పోస్ట్ చేశారు. దీంతో వీడియోలో పదుల సంఖ్యలో ఉన్న మాల్దా మామిడి పండ్లను సూట్ కేసులో ఆమె అత్త సర్దడం కనిపించింది. ఆ తర్వాత ఆ సూట్ కేస్ ఇంటికి చేరగానే.. దాన్ని ఫ్రిజ్ లో దాచుకున్న విజువల్స్ ను శ్రేయా చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read: ఏపీలో మెగా డ్రోన్ నెట్వర్క్.. కిలోమీటరుకు 10 పైసలే.. ఇక గాల్లోనే సరుకు రవాణా!
ఈ వీడియోను చూసిన నెటిజన్లు శ్రేయా అత్తపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఇలాంటి అత్తగారు దొరకడం నిజంగా అదృష్టం’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘డైమండ్స్, బంగారు నగలు ఉన్న సూట్కేస్ కంటే ఈ మామిడి పండ్ల సూట్కేస్ ఎంతో విలువైనది. ఇందులో స్వచ్ఛమైన ప్రేమ ఉంది’ అని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. బిహార్కు చెందిన ఈ అత్త.. కోడలిపై చూపించిన ప్రేమ, అప్యాయత ప్రస్తుతం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
Also Read: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. అధికారం కోసం ఎంట్రీ ఇస్తున్న అగ్ర వ్యూహకర్త..?