E-Paper
Advertisement

ఆన్‌లైన్‌లో ఫ్రీగా చదువుకోవచ్చు.. మరి స్కూల్, కాలేజీ ఫీజులు ఎందుకు పెరుగుతున్నాయి?

ఆన్‌లైన్‌లో ఫ్రీగా చదువుకోవచ్చు.. మరి స్కూల్, కాలేజీ ఫీజులు ఎందుకు పెరుగుతున్నాయి?
Advertisement

education is expensive despite free online| స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎన్నో పాఠాలు, కోర్సులు, ట్యుటోరియల్స్‌ను ఉచితంగా నేర్చుకోవచ్చు.
అయినా భారతదేశంలో పాఠశాలలు, కాలేజీల విద్య ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రులు ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం, రవాణా, ట్యూషన్, కోచింగ్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. కాలేజీ చదువులకు అదనపు ఖర్చులు కూడా కుటుంబాలపై ఆర్థిక భారం పెంచుతున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో సమాచారం ఉచితంగా దొరికినప్పుడు, తల్లిదండ్రులు అసలు దేనికి డబ్బు చెల్లిస్తున్నారు?

ఇంటర్నెట్.. విద్యలో సమాచారాన్ని అందరికీ చేరువ చేసింది గతంలో విద్యార్థులు పాఠశాలలు, ఉపాధ్యాయులు, లైబ్రరీలపై ఎక్కువగా ఆధారపడేవారు. ఇప్పుడు ఇంటర్నెట్ కారణంగా పరిస్థితి పూర్తిగా మారింది. విద్యార్థులు గణితం, సైన్స్, ప్రోగ్రామింగ్, భాషలు, కోడింగ్ వంటి ఎన్నో విషయాలను ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. NPTEL, SWAYAM, DIKSHA, PM eVIDYA వంటి ఆన్‌లైన్ ప్రొగ్రామ్స్ ఉచిత విద్యా వనరులను అందిస్తున్నాయి. అయితే ఉచిత సమాచారం అందుబాటులో ఉండటం మాత్రమే పూర్తిస్థాయి విద్యకు సరిపోదు.

వీడియోలు చూడటం మాత్రమే నేర్చుకోవడాన్ని నిర్ధారించదు

Advertisement

ఒక విద్యార్థి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు చూసినా, ప్రాజెక్ట్ తయారు చేయడం నేర్చుకోకపోవచ్చు. అలాగే వందలాది కోడింగ్ వీడియోలు చూసినా, మంచి ప్రోగ్రామర్‌గా మారడం అంత ఈజీ కాదు. విద్యార్థులకు సాధన, సూచనలు, తప్పులను సరిదిద్దుకునే అవకాశం, సరైన మార్గదర్శకత్వం అవసరం.

ఇదే ఉచిత ఆన్‌లైన్ కంటెంట్‌కు, పూర్తిస్థాయి విద్యకు మధ్య ఉన్న ప్రధాన తేడా.

స్కూల్ అంటే కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు

Advertisement

పాఠశాలలు.. విద్యార్థులకు పాఠ్యాంశాలతో పాటు ఎన్నో ముఖ్యమైన అనుభవాలను అందిస్తాయి. ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలను గుర్తించి వ్యక్తిగతంగా మార్గనిర్దేశం చేయగలరు. తరగతి గదులు కమ్యూనికేషన్, క్రమశిక్షణ, టీమ్‌వర్క్, సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి. ఇతర విద్యార్థులతో కలిసి పనిచేయడం ద్వారా పిల్లలు భిన్నమైన ఆలోచనలు, అభిప్రాయాలను అర్థం చేసుకుంటారు.
అదనంగా, పాఠశాలలు మరియు కాలేజీలు గుర్తింపు పొందిన విద్యార్హతలను అందిస్తాయి.

డిగ్రీతో పాటు నైపుణ్యాలు కూడా అవసరం

ప్రస్తుత ఉద్యోగ మార్కెట్‌లో డిగ్రీ ఒక్కటే ఉంటే సరిపోదు. సమస్య పరిష్కారం, కమ్యూనికేషన్, డిజిటల్ నైపుణ్యాలు, అనుకూలత, ప్రాక్టికల్ అనుభవానికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే విద్యార్థులు కేవలం పరీక్షల్లో మంచి మార్కులు సాధించడం కాకుండా ప్రాజెక్టులు చేయాలి. సమస్యలను పరిష్కరించడం, టీమ్‌తో పనిచేయడం, స్వయంగా నేర్చుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి.

ఉచిత ఆన్‌లైన్ వనరులకు కూడా మార్గదర్శకత్వం అవసరం

ఆన్‌లైన్‌లో ఎన్నో ఉచిత కోర్సులు ఉన్నప్పటికీ, వాటిని సరైన విధంగా ఉపయోగించడానికి మార్గదర్శకత్వం అవసరం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా మెంటర్లు.. పిల్లలకు సరైన కోర్సులు ఎంచుకోవడంలో సహాయపడతారు. పిల్లలు నిరంతరం సాధన చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. అందువల్ల భవిష్యత్తులో డిజిటల్ విభజన కేవలం ఇంటర్నెట్‌ ప్రాప్యతకు పరిమితం కాకపోవచ్చు.

ఇంటర్నెట్ ఉన్నా పిల్లలకు అవకాశాలు సమానంగా ఉండవు

ఇద్దరు పిల్లలకు ఇంటర్నెట్ ఉన్నప్పటికీ, వారి నేర్చుకునే పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండవచ్చు. ఒకరికి ల్యాప్‌టాప్, ప్రశాంతమైన చదువు వాతావరణం, తల్లిదండ్రుల నుంచి అందే సహాయం ఉండవచ్చు. మరొకరు ఒకే స్మార్ట్‌ఫోన్‌ను కుటుంబ సభ్యులతో పంచుకోవాల్సి రావచ్చు. అందుకే మెంటార్‌షిప్, సమయం, సరైన మార్గదర్శకత్వం కూడా విద్యలో కీలకంగా మారుతున్నాయి.

Also Read: మీ టీనేజ్ పిల్లాడు చదువు పట్ల ఆసక్తి చూపడం లేదా? తల్లిదండ్రులు ఈ విషయాలు నేర్పించాలి

పాఠశాలలు కూడా తమ బోధనా విధానాన్ని మార్చుకోవాలి

విద్యార్థులు ఆన్‌లైన్‌లో సమాచారాన్ని సులభంగా పొందుతున్నప్పుడు, పాఠశాలలు కొత్త విధానాలను అనుసరించాలి. ప్రాజెక్టులు, చర్చలు, ప్రయోగాలు, టీమ్‌వర్క్, ప్రాక్టికల్ యాక్టివిటీస్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఉదాహరణకు.. విద్యార్థులు వాతావరణ మార్పుల గురించి చదివి స్థానిక గాలి నాణ్యతను పరిశీలించవచ్చు. ఇలాంటి కార్యకలాపాలు పుస్తకాల జ్ఞానాన్ని వాస్తవ జీవిత నైపుణ్యాలతో అనుసంధానిస్తాయి.

భవిష్యత్తులో హైబ్రిడ్ విద్య మరింత ఉపయోగపడవచ్చు

విద్యార్థులు పాఠశాలలో చదువుతూనే ఆన్‌లైన్‌లో అదనపు నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. వారు కోడింగ్, భాషలు, ప్రాజెక్టులు, ఆన్‌లైన్ కమ్యూనిటీల ద్వారా కొత్త విషయాలను తెలుసుకోవచ్చు. అదే సమయంలో పాఠశాలలు ఉపాధ్యాయులు, క్రమబద్ధమైన వాతావరణం, సామాజిక అనుభవాలను అందిస్తాయి. ఈ రెండు విధానాల కలయిక భారతీయ విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా మారవచ్చు.

తల్లిదండ్రులు అసలు దేనికి డబ్బు చెల్లిస్తున్నారు?

తల్లిదండ్రులు కేవలం సమాచారానికి డబ్బు చెల్లించడం లేదు. వారు ఉపాధ్యాయులు, మార్గదర్శకత్వం, క్రమబద్ధమైన విద్య, సామాజిక అనుభవాలు, గుర్తింపు పొందిన అర్హతల కోసం ఖర్చు చేస్తున్నారు. అయితే ఆన్ లైన్‌లో ఉచితంగా లభించే సమాచారాన్ని అందించే విద్యా సంస్థలు అంత ఫీజు వసూలు చేస్తున్నప్పుడు తమ విద్యా విధానాల విలువను తప్పక నిరూపించుకోవాలి. భవిష్యత్తులో విద్య అంటే సమాచారం అందించడం కంటే, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం మరింత ముఖ్యమవుతుంది.

Also Read: ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం కరెక్టేనా? కొత్త డేటింగ్ ట్రెండ్.. ఎథికల్ నాన్ మోనోగమీ

Related News

పెళ్లయ్యాక డబ్బు విషయంలో గొడవలు రాకుండా ఉండాలంటే…

విషపూరిత పూలతో పవర్‌ఫుల్ ఔషధాలు తయారీ.. మలేరియా, క్యాన్సర్‌కు చికిత్స

చిన్నారుల ప్రాణాలు తీస్తున్న ‘చండీపూర’ వైరస్, ఇప్పటికే 25 మంది..

వానాకాలంలో పిల్లల లంచ్ బాక్స్‌కి బెస్ట్ ఫుడ్స్ ఇవే!

ఈ చిన్న లక్షణం కనిపిస్తే జాగ్రత్త.. 40 దాటాక మీ కళ్లు మీకు ఇస్తున్న వార్నింగ్ కావచ్చు!

చాణక్యనీతి.. అమ్మాయిలు ఈ 5 విషయాలు ఇతరులకు చెప్పకూడదు

మధ్యాహ్నం భోజనం చేసిన వెంటనే నిద్ర వస్తుందా? దీనికి కారణాలు ఇవే

Big Stories

Advertisement
×