BigTV English
Advertisement

Jhansi Station Suicide: రైలు ఇంజిన్ పైకి దూకిన వ్యక్తి.. అంతా చూస్తుండగానే బూడిదైపోయాడు, వీడియో వైరల్

Jhansi Station Suicide: రైలు ఇంజిన్ పైకి దూకిన వ్యక్తి.. అంతా చూస్తుండగానే బూడిదైపోయాడు, వీడియో వైరల్

Jhansi Junction Railway Station: యూపీలో ఒళ్లు జలదరించే సంఘనట జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆగి ఉన్న రైలు ఇంజిన్ మీదికి దూకాడు. అదే సమయంలో రైలు మీద ఉన్న విద్యుత్ వైర్లకు తగిలాడు. కరెంటు తీవ్రతకు ఒక్కసారిగా సజీవ దహనం అయ్యాడు. అందరూ చూస్తుండగానే కాలిబూడిదైపోయాడు. రైల్వే పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని రైలు ఇంజిన్ మీది నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గోవాకు వెళ్లే 12780 నెంబర్ గల హజ్రత్ నిజాముద్దీన్- వాస్కోడా గామా ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఆగింది. అంతకు ముందే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫ్లాట్ ఫారమ్ 1లోకి వచ్చాడు. ఆ తర్వాత టిన్ షెడ్ మీదికి వెళ్లాడు. అదే సమయంలో గోవా రైలు అక్కడికి వచ్చి ఆగడంతో దాని ఇంజిన్ మీదికి  దూకాడు. రైలు ఇంజిన్ మీద ఉన్న విద్యుత్ వైర్లకు తగిలాడు. ఓవర్ హెడ్ పవర్ ధాటికి అతడి శరీరం కాలిపోయింది. క్షణాల్లోనే మంటల్లో కాలి బూడిదయ్యాడు. ఈ ఘటనతో వీరాంగన లక్ష్మీబాయి(ఝాన్సీ) రైల్వే స్టేషన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రయాణీకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయం తెలిసి వెంటనే స్పాట్ కు చేరుకున్న రైల్వే పోలీసులు, విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. ఆ తర్వాత నెమ్మదిగా డెడ్ బాడీని రైలు ఇంజిన్ మీది నుంచి కిందికి దించారు. పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.


మృతిడి వివరాలపై ఆరా తీస్తున్న రైల్వే పోలీసులు

అటు ఈ ఘటనలో చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ అతడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు ఇలా చేశాడు? అతడి మానసిక పరిస్థితి బాగానే ఉందా? లేదా? అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ సర్కిల్ ఆఫీసర్ నయీమ్ మన్సూరి వెల్లడించారు. మృతుడి వయసు దాదాపు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

Read Also:  రైల్లో సీటు కోసం మర్డర్.. మరీ ఇంత దారుణమా!

సుమారు 45 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం

అటు ఈ ఘటనతో ఆ రూట్లో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోవా రైలు సుమారు 45 నిమిషాల పాటు ఝాన్సీ స్టేషన్ లోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇతర రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు రైళ్లను కాసేపు నిలిపివేశారు. గోవా రైలు ఝాన్సీ స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత మిగతా రైళ్లు యథావిధిగా తమ సర్వీసులను కొనసాగించాయి.

Read Also: ట్రయల్ రన్ కు రెడీ అవుతున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Related News

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Big Stories

×