BigTV English

Jhansi Station Suicide: రైలు ఇంజిన్ పైకి దూకిన వ్యక్తి.. అంతా చూస్తుండగానే బూడిదైపోయాడు, వీడియో వైరల్

Jhansi Station Suicide: రైలు ఇంజిన్ పైకి దూకిన వ్యక్తి.. అంతా చూస్తుండగానే బూడిదైపోయాడు, వీడియో వైరల్

Jhansi Junction Railway Station: యూపీలో ఒళ్లు జలదరించే సంఘనట జరిగింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆగి ఉన్న రైలు ఇంజిన్ మీదికి దూకాడు. అదే సమయంలో రైలు మీద ఉన్న విద్యుత్ వైర్లకు తగిలాడు. కరెంటు తీవ్రతకు ఒక్కసారిగా సజీవ దహనం అయ్యాడు. అందరూ చూస్తుండగానే కాలిబూడిదైపోయాడు. రైల్వే పోలీసులు విద్యుత్ సరఫరా నిలిపివేసి మృతదేహాన్ని రైలు ఇంజిన్ మీది నుంచి తొలగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. గోవాకు వెళ్లే 12780 నెంబర్ గల హజ్రత్ నిజాముద్దీన్- వాస్కోడా గామా ఝాన్సీ రైల్వే స్టేషన్ లో ఆగింది. అంతకు ముందే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫ్లాట్ ఫారమ్ 1లోకి వచ్చాడు. ఆ తర్వాత టిన్ షెడ్ మీదికి వెళ్లాడు. అదే సమయంలో గోవా రైలు అక్కడికి వచ్చి ఆగడంతో దాని ఇంజిన్ మీదికి  దూకాడు. రైలు ఇంజిన్ మీద ఉన్న విద్యుత్ వైర్లకు తగిలాడు. ఓవర్ హెడ్ పవర్ ధాటికి అతడి శరీరం కాలిపోయింది. క్షణాల్లోనే మంటల్లో కాలి బూడిదయ్యాడు. ఈ ఘటనతో వీరాంగన లక్ష్మీబాయి(ఝాన్సీ) రైల్వే స్టేషన్‌లో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రయాణీకులు అక్కడి నుంచి పరుగులు తీశారు. విషయం తెలిసి వెంటనే స్పాట్ కు చేరుకున్న రైల్వే పోలీసులు, విద్యుత్ సరఫరాను నిలిపివేయించారు. ఆ తర్వాత నెమ్మదిగా డెడ్ బాడీని రైలు ఇంజిన్ మీది నుంచి కిందికి దించారు. పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు.


మృతిడి వివరాలపై ఆరా తీస్తున్న రైల్వే పోలీసులు

అటు ఈ ఘటనలో చనిపోయిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరు అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంతకీ అతడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు ఇలా చేశాడు? అతడి మానసిక పరిస్థితి బాగానే ఉందా? లేదా? అనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీస్ సర్కిల్ ఆఫీసర్ నయీమ్ మన్సూరి వెల్లడించారు. మృతుడి వయసు దాదాపు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని వెల్లడించారు. త్వరలోనే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

Read Also:  రైల్లో సీటు కోసం మర్డర్.. మరీ ఇంత దారుణమా!

సుమారు 45 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం

అటు ఈ ఘటనతో ఆ రూట్లో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గోవా రైలు సుమారు 45 నిమిషాల పాటు ఝాన్సీ స్టేషన్ లోనే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఇతర రైళ్ల రాకపోకలకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. పలు రైళ్లను కాసేపు నిలిపివేశారు. గోవా రైలు ఝాన్సీ స్టేషన్ నుంచి బయల్దేరిన తర్వాత మిగతా రైళ్లు యథావిధిగా తమ సర్వీసులను కొనసాగించాయి.

Read Also: ట్రయల్ రన్ కు రెడీ అవుతున్న వందే భారత్ స్లీపర్ ట్రైన్, ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×