BigTV English
Advertisement

Woman Burned in Train: మహిళకు నిప్పు.. మంటల్లో కాలిపోతుంటే చూసి ఎంజాయ్ చేసిన కిరాతకుడు!

Woman Burned in Train: మహిళకు నిప్పు.. మంటల్లో కాలిపోతుంటే చూసి ఎంజాయ్ చేసిన కిరాతకుడు!

అమెరికాలో అత్యంత కిరాతకమైన సంఘటన జరిగింది. న్యూయార్ లోని ఓ సబ్ వేలో మహిళకు నిప్పు అంటించాడు ఓ సైకో. ఆమె మంటల్లో తగలబడుతుంటే అక్కడే కూర్చొని చూసి ఎంజాయ్ చేశాడు. ఆదివారం ఉదయం బ్రూ క్లిన్ లోని స్టిల్ వెల్ అవెన్యూ దగ్గర లైన్ చివరలో ఉన్న F ట్రైన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు స్టేషన్ లో ఆగిన నిందితుడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికాలో సంచలనం కలిగించింది.


నిద్రపోతున్న మహిళకు నిప్పు అంటించిన దుర్మార్గుడు

బ్రూ క్లిన్ లోని స్టిల్ వెల్ అవెన్యూ సబ్ వే దగ్గర ఓ మహిళ నిద్రపోతున్నది. దుండగుడు ఆమె దగ్గరికి వెళ్లి లైటర్ లాంటి వస్తువుతో ఆమె దుస్తులకు నిప్పంటించాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. సదరు మహిళ బాధను తట్టుకోలేక, ఆగి ఉన్న రైల్లోకి వెళ్లింది. అయినప్పటికీ మంటలు ఇంకా వ్యాపించాయి. మంటల్లో కాలుతుంటే తట్టుకోలేక మహిళ గట్టిగా కేకలు వేసింది.


 వెంటనే రంగంలోకి దిగిన పెట్రోలింగ్ పోలీసులు

స్టేషన్‌ పై లెవల్‌ లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గమనించారు. వెంటనే తమ టీమ్ ను అలర్ట్ చేశారు. వెంటనే మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే మహిళ శరీరం పూర్తిగా కాలిపోయింది. బాధితురాలు 90 శాతానికి పైగా కాలిన గాయాలతో స్పాట్ లోనే ప్రయాణాలు కోల్పోయినట్లు పోలీసులు వెల్లడించారు.

కాలిపోతున్న మహిళను చూసి ఎంజాయ్ చేసిన సైకో

ఈ ఘటనకు సంబంధించి న్యూయార్క్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. సైకో తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని చెప్పుకొచ్చారు. అకారణంగా మహిళకు నిప్పు అంటించడంతో పాటు ఆమె రైల్లోకి వెళ్లి కాలిపోతుంటే, అతడు రైలు బయటే ఫ్లాట్ ఫారం బెంచ్ మీద కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేశాడని చెప్పారు. వెంటనే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ విడుదల చేశారు. ఈ విజువల్స్ చూసి స్థానికులు నిందితుడికి సంబందించిన సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Read Also: రైల్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే, మీ మొబైల్ పని అయినట్టే!

బాధితురాలి ఇంకా గుర్తించని పోలీసుల

వాస్తవానికి ఈఘటనలో చనిపోయిన మహిళకు నిందితుడికి అసలు ఎలాంటి సంబంధం లేదని న్యూయార్క్ పోలీసులు తెలిపారు. కేవలం సైకో తనంతోనే ఆమెకు నిప్పు అంటించినట్లు చెప్పారు. అటు అనుమానితుడిని పట్టుకోవడంలో సాయం చేసిన స్థానికులను న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రశంసించారు. ఇలాంటి హింసాత్మక ఘటలకు సబ్ వేలలో స్థానం లేదని తేల్చి చెప్పారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తాము కృషి చేస్తామని వెల్లడించారు. అటు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని గ్వాటెమాల నుంచి వలస వచ్చిన సెబాస్టియన్‌గా గుర్తించారు. అతడు 2018లో అరిజోనా నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినట్లుగా పోలీసులు తెలిపారు. అటు ఈ ఘటనపై పలువురు ప్రముఖులు స్పందించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలని ఎలన్ మస్క్ కోరారు.

Read Also: ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన గోల్డెన్ చారియట్, అదీ కేవలం 38 మందితో..

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×