BigTV English

Indian Railways: రైల్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే, మీ మొబైల్ పని అయినట్టే!

Indian Railways: రైల్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? అయితే, మీ మొబైల్ పని అయినట్టే!

Indian Railway Rules: నిత్యం కోట్లాది మంది రైలు ప్రయాణం చేస్తుంటారు. వారిలో కొంత మంది సుదీర్ఘ ప్రయాణాలు చేస్తుంటారు. చాలా మంది ట్రైన్ లో ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఉపయోగిస్తారు. కొంత మంది జర్నీలోనే తమ పనులు చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తాయి. అయితే, రైళ్లలో మోబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది రాత్రి పూట ఛార్జింగ్ పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ, రైళ్లలో రాత్రి 11 గంటల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మోబైల్స్, ల్యాప్ టాట్స్ కు ఛార్జింగ్ పెట్టుకోకూడదంటున్నారు నిపుణులు.


Read Also: ఈ ఏడాది ఇన్ని వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయా? వచ్చే ఏడాది ఇండియన్ రైల్వేలో మరింత జోష్!

ఛార్జింగ్ సాకెట్ల దగ్గర హెచ్చరిక బోర్డు


చాలా రైళ్లలో ఛార్జింగ్ సాకెట్ల దగ్గర హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి. మోబైల్స్, ల్యాప్ టాప్స్  రాత్రి 11 గంటల నుంచి 5 గంటల వరకు ఛార్జింగ్ పెట్టకూడదని అందులో రాసి ఉంటుంది. అయితే, ఎందుకు ఈ సమయంలో ఛార్జింగ్ పెట్టకూడదో చాలా మందికి తెలియదు. కానీ, ఇందుకో బలమైన కారణం ఉందంటున్నారు నిపుణులు. సాధారణంగా ఇళ్లలో ఆల్టర్నేటివ్ కరెంట్ (AC) సరఫరా అవుతుంది. రైళ్లలో డైరెక్ట్ కరెంట్(DC) సరఫరా అవుతుంది. ఒక్కోసారి కరెంట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఒక్కోసారి తక్కువగా వస్తుంది. ఇలా పవర్ సరఫరా కావడం చాలా ప్రమాదకరం. అందుకే రైల్లో ఫోన్లకు ఛార్జింగ్ పెట్టి ఉపయోగిస్తే స్ట్రక్ అవుతుంది. కరెంట్ సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా ఇలా జరుగుతుంది.

Read Also: టికెట్ క్యాన్సిలేషన్ ఇలా చేస్తున్నారా? రీఫండ్ అస్సలు రాదు జాగ్రత్త!

కాసేపు ఛార్జింగ్ పెట్టి తీసేయడం మంచిది!

అస్సలు ఛార్జింగ్ లేని సమయంలోనే రైళ్లలో మోబైల్స్, ల్యాప్ టాప్ లకు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అదీ అరగంట వరకు పెట్టుకోవడం ఉత్తమం. కానీ, పడుకునే ముందు ఛార్జింగ్ పెట్టి అలాగే ఉంచితే, ఒక్కోసారి కరెంట్ బ్యాక్ టు బ్యాక్ ఎక్కువగా వస్తే, ఫోన్ లేదంటే ల్యాప్ టాప్ పేలిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే రైల్లో షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఇలాంటి కారణాల వల్లే చాలా రైళ్లలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందుకే భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో రాత్రి పూట ఛార్జింగ్ పెట్టకూడదనే నిబంధనను అమలు చేసింది. ఒకవేళ అత్యవసరం అనుకుంటే 10 నుంచి 20 నిమిషాల వరకు పెట్టుకోవచ్చు సూచించింది. అంతేతప్ప, రాత్రి పూట మొత్తం ఛార్జింగ్ అస్సలు పెట్టుకోకూడదని తేల్చి చెప్పింది. సో, ఒకవేళ మీరు కూడా రైలు ప్రయాణం చేస్తున్నట్లైతే రాత్రి పూట వీలైనంత వరకు మీ ఫోన్లు, ల్యాప్ టాప్ లకు ఛార్జింగ్ పెట్టుకోకపోవడం ఉత్తమం. ఈ విషయాన్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి.

Read Also: ఆరేళ్ల తర్వాత మళ్లీ పట్టాలెక్కిన గోల్డెన్ చారియట్, అదీ కేవలం 38 మందితో..

Related News

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Trains: ఇవాళ 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Vande Bharat Sleeper: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

Dasara Special Trains: దసరా వేళ రైల్వే గుడ్ న్యూస్, ముంబై నుంచి కరీంనగర్ కు స్పెషల్ ట్రైన్!

Sunrise Express: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రైలులో సాంకేతిక లోపం.. ప్రయాణికుల ఇబ్బందులు

Afghan Boy: విమానం ల్యాండింగ్ గేర్‌‌‌లో 13 ఏళ్ల బాలుడు.. కాబూల్ నుంచి ఢిల్లీకి ట్రావెల్

Stealing Bedsheets: ఏసీ కోచ్ లో దుప్పట్లు దొంగతనం చేసి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రిచ్ ఫ్యామిలీ

Big Stories

×