E-Paper
Advertisement

100 Snakes In House: అర్ధరాత్రి కలకలం.. రైతు ఇంట్లో 100 పాములు.. గ్రామస్తులు ఎంత తప్పు చేశారంటే?

100 Snakes In House: అర్ధరాత్రి కలకలం.. రైతు ఇంట్లో 100 పాములు.. గ్రామస్తులు ఎంత తప్పు చేశారంటే?
Advertisement

100 Snakes In House| అర్ధరాత్రి వేళ ఆ గ్రామంలో అందరూ నిద్రపోతుండగా.. ఒక్కసారిగా ఒక రైతు ఇంట్లో అరుపులు, కేకలు.. దీంతో గ్రామస్తులంతా అక్కడికి చేరి చూడగా.. షాకింగ్ దృశ్యం. ఆ రైతు ఇంట్లో నుంచి డజన్ల కొద్దీ పాములు కనిపించాయి. ఆ పాములతో ప్రమాదం పొంచి ఉందనే ఆందోళనతో ఆ గ్రామస్తులు వాటిని చంపడం మొదలుపెట్టారు. కానీ అటవీ శాఖ అధికారులు మాత్రం గ్రామస్తులు తప్పు చేశారని.. వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. మీరట్ సమీపంలోని సిమౌలి గ్రామంలో ఒక నిశ్శబ్ద రాత్రి ఒక్కసారిగా భయానక చిత్రంలా మారింది. రైతు మహ్ఫూజ్ సైఫీ ఇంటి ఆవరణలో నుంచి అకస్మాత్తుగా వందల పాములు బయటకు రావడంతో గ్రామంలో కలకలం రేగింది. గ్రామస్తులంతా భయంతో గందరగోళానికి గురయ్యారు. ఆ తరువాత తమ ప్రాణాలకు హాని ఉందని భావించి గ్రామస్తులు ఒక్కటై ఆ సర్పాలను చంపేయాలని నిశ్చయించుకున్నారు.

Advertisement

రాత్రి నిద్రపోయే సమయంలో మహ్ఫూజ్ సైఫీ తన ఇంటి గుమ్మం వద్ద ఒక సర్పాన్ని చూశాడు. వెంటనే దాన్ని అతను చంపేశాడు. కానీ కొద్ది సేపట్లో మరొకటి, ఆ తర్వాత మరొకటి బయటకు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇంటి గుమ్మం సమీపంలోని రాంపు కింద నుండి డజన్ల కొద్దీ పాములు బయటకు రావడం చూసి అతను భయపడిపోయారు. అతని కుటుంబ సభ్యులు ఇది చూసి అరుపులు, కేకలు వేశారు. దీంతో గ్రామం అంతా ఈ వార్త వేగంగా వ్యాపించింది. కర్రలు, రాళ్లతో గ్రామస్తులు పాములపై దాడి చేసేందుకు వచ్చారు. రాత్రంతా గంటలపాటు పోరాడి, 50 కంటే ఎక్కువ పాములను చంపి, వాటిని కాల్చేసి సమీపంలో ఒక గుంత తవ్వి పాతిపెట్టారు.

గ్రామస్తులు తప్పు చేశారు.. అటవీ శాఖ అధికారుల వార్నింగ్

Advertisement

పాముల నుంచి గ్రామస్తులు తమను తాము రక్షించుకున్నారని భావించినప్పటికీ, వారు చట్టపరమైన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. వందకు పైగా పాములను గ్రామస్తులు చంపేశారని ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ శాఖకు సమాచారం అందింది. వెంటనే అధికారులు ఒక బృందాన్ని సంఘటన స్థలానికి పంపారు.

డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సర్పాలు 1972 వన్యప్రాణి రక్షణ చట్టం కింద రక్షిత జీవులని తెలిపారు. “ఆ పాములను చంపి, అటవీ శాఖకు సమాచారం ఇవ్వకుండా గుంత తవ్వి పాతిపెట్టడం తెలిసింది. ఇవి రక్షిత జీవులు, ఏదైనా చర్య తీసుకునే ముందు అటవీ శాఖకు తెలియజేయాలి,” అని అన్నారు.

ప్రాథమిక విచారణలో ఈ సర్పాలు విషం లేని నీటి సర్పాలుగా తేలింది, ఇవి సాధారణంగా కాలువలు, తడి ప్రాంతాల్లో కనిపిస్తాయి. వీటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని అధికారులు వెల్లడించారు.

ఎక్కువ సంఖ్యలో ఉన్న పాములను గ్రామస్తులు చంపేశారని వీడియో బాగా వైరల్ కావడంతో సోషల్ మీడియాలో దీని గురించి నెటిజెన్లు చర్చించుకుంటున్నారు. అటవీ అధికారులు ఇప్పుడు గ్రామస్తులను విచారణ చేస్తున్నారు. ఎన్ని సర్పాలు చంపబడ్డాయి, ఎక్కడ పాతిపెట్టారో తెలుసుకుంటున్నారు. “మా బృందం సంఘటన స్థలంలో ఉంది, గ్రామస్తులను ప్రశ్నిస్తోంది,” అని డిఎఫ్‌ఓ తెలిపారు.

పాములు ప్రకృతి నియంత్రణలో ఓ భాగం. అవి ఆహార గొలుసులో కీలక పాత్ర పోషిస్తాయి, కీటకాలను నియంత్రిస్తాయి. వాటిని ఇలా భారీ సంఖ్యలో చంపడం పర్యావరణంపై ప్రభావం చూపవచ్చు అని అధికారులు అభిప్రాయపడ్డారు.

Also Read: పోలీస్ ఉద్యోగ పరీక్షల్లో భారీ స్కామ్.. ఆధార్ కార్డ్‌తో గుట్టు రట్టు

పాములు దాడి చేయకుండానే వాటిని గ్రామస్తులు చంపేయడం తప్పు అని.. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే అటవీ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద తగిన చర్యలు చేపడతామని అన్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×