BigTV English

104 Years Old Man Voted: 18వ సారి ఓటేసిన 104 ఏళ్ల రాముడు.. నేటి ఓటర్లకు ఆదర్శం!

104 Years Old Man Voted: 18వ సారి ఓటేసిన 104 ఏళ్ల రాముడు.. నేటి ఓటర్లకు ఆదర్శం!

104 Years Old Man Voted 18 times: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి యువ ఓటర్లు వస్తూనే ఉంటారు. అయినా.. ఓటింగ్ శాతం తగ్గిపోతుంది. కారణం.. ఎన్నికలపై ఆసక్తి లేకపోవడం, ఏ నాయకుడు వచ్చినా అభివృద్ధి చేయడన్న అభిప్రాయం.. ఎన్నికల ముందు వాగ్ధానాలే తప్ప.. గెలిస్తే మచ్చుకైనా ఉద్యోగాలివ్వకపోవడం వంటివి పోలింగ్ శాతంపై ప్రభావం చూపిస్తున్నాయి. పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేసేవారు అంతకంతకూ తగ్గుతున్నారు.


ఓటు ఎందుకు వేయాలి ? వేస్తే మాకేంటి ? అనుకునేవారికి ఓ తాతగారు ఆదర్శంగా నిలుస్తున్నారు. 104 ఏళ్ల వయసులోనూ ఆయన తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. 18వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు తూ.గో జిల్లా నిడదవోలుకు చెందిన రొంగల రాముడు. ఆయనొక వ్యాపారవేత్త. ముందుగా వృద్ధులు, వికలాంగుల కోసం కేటాయించిన హోమ్ ఓటింగ్ ద్వారా రాముడు 18వ సారి ఓటు వేసారు.

Also Read: నేడు, రేపు హోం ఓటింగ్.. ప్రారంభమైన ప్రక్రియ


ఓటింగ్ సిబ్బంది నిడదవోలులోని ఆయన ఇంటికి బ్యాలెట్ బాక్సుల్ని తీసుకెళ్లారు. ఆయన తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు. ఓటింగ్ ఎట్ హోమ్ కార్యక్రమం ద్వారా 85 సంవత్సరాలు పైబడినవారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది ఈసీ. ఏపీలో ఈ కార్యక్రమం గురువారం నుంచే మొదలైంది. మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది.

Related News

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

Big Stories

×