E-Paper
Advertisement

Chirutha caught in Tirumala : బోనులో చిక్కిన చిరుత.. నడకదారిలో ఆంక్షలు..

Chirutha caught in Tirumala : బోనులో చిక్కిన చిరుత.. నడకదారిలో ఆంక్షలు..
Advertisement
Chirutha caught in Tirumala

Tirumala latest updates in telugu(Local news andhra Pradesh) :

తిరుమలలో చిరుత బోనులో చిక్కింది. ఇటీవల అలిపిరి నడకమార్గంలో 6 ఏళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు చిరుతను బంధించే చర్యలు చేపట్టారు. బాలికపై దాడి చేసిన ప్రాంతంలో మూడు బోన్లు ఏర్పాట్లు చేశారు. చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు.

చిరుత రెండు రోజులుగా ఐదు ప్రాంతాల్లో సంచరించినట్లు గుర్తించారు . ఈ క్రమంలోనే తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

Advertisement

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక లక్షిత తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. నెలన్నర క్రితం నడకమార్గంలోనే ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటన తర్వాత చిరుతను బంధించారు. కల్యాణ్‌ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

చిరుత దాడి ఘటన తర్వాత టీటీడీ అప్రమత్తమైంది. నడకదారిలో ఆంక్షలు విధించింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతిస్తోంది. అయితే తాజాగా తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నడకదారిలో చిరుత సంచారించినట్లు చెబుతున్నారు భక్తులు. అయితే అధికారులు కూడా చిరుత కదలికలు ఉన్నట్లు నిర్థారించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×