E-Paper
Advertisement

Chirutha caught in Tirumala : బోనులో చిక్కిన చిరుత.. నడకదారిలో ఆంక్షలు..

Chirutha caught in Tirumala : బోనులో చిక్కిన చిరుత.. నడకదారిలో ఆంక్షలు..
Advertisement
Chirutha caught in Tirumala

Tirumala latest updates in telugu(Local news andhra Pradesh) :

తిరుమలలో చిరుత బోనులో చిక్కింది. ఇటీవల అలిపిరి నడకమార్గంలో 6 ఏళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు చిరుతను బంధించే చర్యలు చేపట్టారు. బాలికపై దాడి చేసిన ప్రాంతంలో మూడు బోన్లు ఏర్పాట్లు చేశారు. చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు.

చిరుత రెండు రోజులుగా ఐదు ప్రాంతాల్లో సంచరించినట్లు గుర్తించారు . ఈ క్రమంలోనే తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

Advertisement

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక లక్షిత తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. నెలన్నర క్రితం నడకమార్గంలోనే ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటన తర్వాత చిరుతను బంధించారు. కల్యాణ్‌ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

చిరుత దాడి ఘటన తర్వాత టీటీడీ అప్రమత్తమైంది. నడకదారిలో ఆంక్షలు విధించింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతిస్తోంది. అయితే తాజాగా తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నడకదారిలో చిరుత సంచారించినట్లు చెబుతున్నారు భక్తులు. అయితే అధికారులు కూడా చిరుత కదలికలు ఉన్నట్లు నిర్థారించారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×