BigTV English
Advertisement

Chirutha caught in Tirumala : బోనులో చిక్కిన చిరుత.. నడకదారిలో ఆంక్షలు..

Chirutha caught in Tirumala : బోనులో చిక్కిన చిరుత.. నడకదారిలో ఆంక్షలు..
Chirutha caught in Tirumala

Tirumala latest updates in telugu(Local news andhra Pradesh) :

తిరుమలలో చిరుత బోనులో చిక్కింది. ఇటీవల అలిపిరి నడకమార్గంలో 6 ఏళ్ల బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేసింది. ఈ ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు చిరుతను బంధించే చర్యలు చేపట్టారు. బాలికపై దాడి చేసిన ప్రాంతంలో మూడు బోన్లు ఏర్పాట్లు చేశారు. చిరుత కదలికలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను అమర్చారు.


చిరుత రెండు రోజులుగా ఐదు ప్రాంతాల్లో సంచరించినట్లు గుర్తించారు . ఈ క్రమంలోనే తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.

శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన బాలిక లక్షిత తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. నెలన్నర క్రితం నడకమార్గంలోనే ఓ బాలుడిపై చిరుత దాడి చేసింది. అడవిలోకి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ ఘటన తర్వాత చిరుతను బంధించారు. కల్యాణ్‌ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.


చిరుత దాడి ఘటన తర్వాత టీటీడీ అప్రమత్తమైంది. నడకదారిలో ఆంక్షలు విధించింది. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే 15 ఏళ్ల లోపు పిల్లలను అనుమతిస్తోంది. అయితే తాజాగా తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. నడకదారిలో చిరుత సంచారించినట్లు చెబుతున్నారు భక్తులు. అయితే అధికారులు కూడా చిరుత కదలికలు ఉన్నట్లు నిర్థారించారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×