E-Paper
Advertisement

ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..

ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..
Advertisement

ACB raids in ap today: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్‌ వాసా నగేష్‌ ఇంటిలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది. విజయవాడ కుమ్మరిపాలెం కూడలి లోటస్‌ అపార్టుమెంట్‌లోని నగష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, భీమడోలు ప్రాంతాల్లోని నగేష్ సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ దాడులకు ముందే సూపరింటెండెంట్‌ సెలవు పెట్టారు. అయినాసరే ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కుమ్మరిపాలెం సెంటర్ లో నగేష్ అద్దెకు ఉంటున్న ఇంట్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలోని నగేష్‌ నివాసంలో రూ.17.91 లక్షల నగదు, 209 గ్రాముల బంగారం లభ్యమయ్యాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ద్వారకా తిరుమలలో జీ+4 ఇల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలులో మూడు గృహాలు, ఒక ప్లాటుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ద్వారకాతిరుమల యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఒక లాకరును ఇంకా తెరవాల్సి ఉందని తెలిపారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లు ధ్రువీకరించుకోవాల్సి ఉన్నందున సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు స్పష్టంచేశారు.

నగేష్‌ గతంలో ద్వారకా తిరుమలలో పని చేశారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆర్జేసీ స్థాయి అధికారి ఈ వ్యవహారంపై విచారణ చేశారు. ఈ కేసులో నగేష్ నుంచి డబ్బులు రికవరీ చేశారు. గతంలో శాఖాపరమైన విచారణ చేసిన ఆర్జేసీ భ్రమరాంబ ప్రస్తుతం దుర్గగుడి ఈవోగా ఉన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×