E-Paper
Advertisement

ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..

ACB : దుర్గ గుడి సూపరింటెండెంట్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా ఆస్తులు గుర్తింపు..
Advertisement

ACB raids in ap today: విజయవాడ దుర్గగుడి సూపరింటెండెంట్‌ వాసా నగేష్‌ ఇంటిలో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలు రావడంతో తనిఖీలు చేపట్టింది. విజయవాడ కుమ్మరిపాలెం కూడలి లోటస్‌ అపార్టుమెంట్‌లోని నగష్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, భీమడోలు ప్రాంతాల్లోని నగేష్ సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఏసీబీ దాడులకు ముందే సూపరింటెండెంట్‌ సెలవు పెట్టారు. అయినాసరే ఏసీబీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కుమ్మరిపాలెం సెంటర్ లో నగేష్ అద్దెకు ఉంటున్న ఇంట్లో పలు డాక్యుమెంట్లు, బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించారు. తనిఖీల్లో ఏసీబీ డీఎస్పీతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ సమీపంలోని నగేష్‌ నివాసంలో రూ.17.91 లక్షల నగదు, 209 గ్రాముల బంగారం లభ్యమయ్యాయని ఏసీబీ అధికారులు ప్రకటించారు. ద్వారకా తిరుమలలో జీ+4 ఇల్లు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నిడదవోలులో మూడు గృహాలు, ఒక ప్లాటుకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ద్వారకాతిరుమల యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌లో ఒక లాకరును ఇంకా తెరవాల్సి ఉందని తెలిపారు. బ్యాంకు ఖాతాలు, లాకర్లు ధ్రువీకరించుకోవాల్సి ఉన్నందున సోదాలు కొనసాగుతాయని ఏసీబీ అధికారులు స్పష్టంచేశారు.

నగేష్‌ గతంలో ద్వారకా తిరుమలలో పని చేశారు. ఆ సమయంలో కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించలేదని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆర్జేసీ స్థాయి అధికారి ఈ వ్యవహారంపై విచారణ చేశారు. ఈ కేసులో నగేష్ నుంచి డబ్బులు రికవరీ చేశారు. గతంలో శాఖాపరమైన విచారణ చేసిన ఆర్జేసీ భ్రమరాంబ ప్రస్తుతం దుర్గగుడి ఈవోగా ఉన్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×