BigTV English

Andhra Pradesh : ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం.. అమరజీవికి సీఎం జగన్ నివాళి..

Andhra Pradesh : ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం.. అమరజీవికి సీఎం జగన్ నివాళి..

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవత­రణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం క్యాంపు కార్యా­లయంలో సీఎం వైఎస్ జగన్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. తెలుగు తల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూలమాల వేశారు. అమరజీవికి నివాళులు అర్పించారు.


మరోవైపు ఏపీవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచే అన్ని జిల్లా కేంద్రాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్లు, ఎస్‌పీలు పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ఏపీలో నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. అంతకుముందు 5 ఏళ్లు అప్పటి టీడీపీ ప్రభుత్వం జూన్ 2న నవ నిర్మాణ దీక్ష నిర్వహించింది.


Related News

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Big Stories

×